వందలకొద్దీ ఖాతాల్లో పదేసివేల చొప్పున డబ్బు డిపాజిట్ అవుతోంది. ఒక్కో ఖాతాలో రూ. 10,000 చొప్పున మొత్తం రూ. 1.7కోట్లు జన్ధన్ ఖాతాల్లో డిపాజిట్ అయినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆదాయపు పన్నుశాఖ రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఈ డబ్బు వారి ఖాతాల్లోకి జమ చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.
కాగా, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ డిపాజిట్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో నగదు ప్రవాహాన్ని అడ్డుకునేందుకు అధికారులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు.