ఒక్కో దేశంలో ఒక్కో సంప్రదాయం ఆచారంగా వస్తుంటుంది. ఇండియాలో దేశవ్యాప్తంగా గణపతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటుంటారు. ఈ వేడుకల కోసం దేశం ఆరు నెలలుగా సన్నాహాలు చేస్తుంటుంది. ముఖ్యంగా ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ వేడుకలు భారీ ఎత్తున జరుగుతుంటాయి. ఈ వేడుకల్లో పాల్గొనడానికి ఎక్కడెక్కడికినుంకో వస్తుంటారు.
ఇలాంటి వేడుకలు మన దేశంలోనే కాదు.. భారతీయులు ఎక్కువుగా ఉండే ఫిజి దేశంలో కూడా భారీ ఎత్తున నిర్వహిస్తుంటారు. ఫిజిలో 48% భారతీయులు ఉన్నారు. అక్కడ ప్రభుత్వంలో చలామంది భారతీయ మంత్రులు కూడా ఉన్నారు. ఫిజిలో మాత్రమే కాదు.. ప్రపంచంలోని చాలా దేశాల్లో భారతీయులు ఉన్నారు. వారంతా ఇండియాలో జరిగే పండుగలను అక్కడ కూడా చేసుకుంటూ వస్తుంటారు.
అయితే, చాలా దేశాల్లో భారతీయులు పండుగలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వరు. కానీ, ఆఫ్రికాలోని ఘనా దేశంలో భారతీయ పండగైనా వినాయక చవితిని భారీ ఎత్తున చేస్తారు. వినాయక చవితిని ఆఫ్రికా స్టైల్ లో నిర్వహిస్తుంటారు. ఘానాలోని అక్రలో వేడుకలు బాగా జరుగుతుంటాయి. అక్రలో 12 వేలమందికి పైగా భారతీయులు ఉన్నారు. వీరు ఆ దేశంలో ప్రతిఏటా గణపతి ఉత్సవాలను నిర్వహిస్తారు.
మూడు రోజులపాటు అంగరంగవైభవంగా పూజలు నిర్వహించిన అనంతరం ఆఫ్రికా స్టైల్ లో వాయిద్యాలు వాయిస్తూ.. ఊరేగింపుగా గణపయ్యను తీసుకెళ్లి సముద్రంలో నిమర్జనం చేస్తుంటారు. ఈ ఆచారం ఇప్పటిది కాదు. ఎప్పటి నుంచి దాదాపుగా 50 ఏళ్లుగా వస్తున్నది. భారతీయులు జరుపుకునే ఈ వేడుకలో అక్కడి యువత, ఘానా నాయకులు కూడా పాల్గొంటుంటారు. మతసామరస్యానికి ప్రతీకగా ఈ పండుగ జరుగుతుంది. ఒక్క గణపతి ఉత్సవాలు కాదు. ఇండియాలో జరిగే ప్రతి పండుగను అక్కడ నిర్వహిస్తారని భారతీయులు చెప్తున్నారు. గణపతి ఉత్సవం తరువాత శ్రీకృష్ణాష్టమి, దీపావళిని బాగా చేస్తారట.