3 రోజులైనా పొలాల్లో నీరు వెనక్కి తీయలేదు, పంటలు నీట మునిగి ఉరకెత్తాయి అని ఆయన పేర్కొన్నారు. బుగ్గవంక, పించా ప్రాజెక్టు, అన్నమయ్య ప్రాజెక్టు ఉదంతాలే... వైసిపి చేతగాని పాలనకు ప్రత్యక్ష సాక్ష్యాలు అని మండిపడ్డారు. నీట మునిగిన పంటలను వీడియోలు, ఫొటోలు తీయాలి అని ఆయన సూచించారు. కూలిన ఇళ్లు, దెబ్బతిన్న గృహాలను వీడియోలు, ఫొటోలు తీయాలి ఆదేశించారు. పంట నష్టం, ఆస్తి నష్టాన్ని డిజిటల్ రికార్డు కింద నమోదు చేయాలి అని ఆయన పేర్కొన్నారు. పేరు, ఊరు వివరాలతో ప్రతి రైతు తనకు జరిగిన పంట నష్టంపై వీడియోలో వెల్లడించాలి అనారు.
దెబ్బతిన్న ఇళ్లను వీడియోల ద్వారా ప్రతి పేద కుటుంబం వెల్లడించాలి అని ఆయన సూచించారు. వాట్సప్ ద్వారా 7557557744 నెంబర్ కు ఆ వీడియోలు, ఫోటోలను పంపాలి అని ఆయన ఆయన పేర్కొన్నారు. వీడియో, ఫొటో ఆధారాలతో సహా స్థానిక అధికారులకు వినతులు అందించాలి అని అన్నారు. విపత్తు బాధితులకు సోషల్ మీడియా కార్యకర్తలు అండగా ఉండాలి అని ఆయన సూచనలు చేసారు. పంట నష్టం, ఆస్తినష్టం సాక్ష్యాధారాల సేకరణలో రైతులు, పేదలకు సహకారం అందించాలి అన్నారు. రైతులకు, పేదలకు అండగా ఉండటం మనందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.