ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ కరోనా వైరస్ కేసులు ఎక్కువవుతున్నాయి. మరణాలు కూడా  పెరిగాయి. కరోనా మహమ్మారి బారిన పడి గురువారం నలుగురు మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో ఒకరు, గుంటూరులో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు కరోనా మహమ్మారి వల్ల మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 7,138కి చేరింది.కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు పెద్ద ఎత్తున నిర్వహించినా కూడా కేసులు తగ్గాయి.

డిశ్చార్జిల సంఖ్య కూడా స్వల్పంగా పడిపోయాయి. కరోనా మహమ్మారి నుంచి గురువారం  మొత్తం 219 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8,76,140 మంది కరోనా మహమ్మారి బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 2,338కు పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,24,82,943 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో తెలిపింది.ఇక, గురువారం  అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 51 కరోనా కేసులు నమోదు కాగా, శ్రీకాకుళం జిల్లాలో అత్యల్పంగా 2 కేసులు నమోదయ్యాయి. ఇక, విజయనగరం జిల్లాలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు రాష్ట్రంలోనే అత్యల్పంగా 37 ఉన్నాయి.ఈ విధంగా  అత్యధికంగా గురువారం  కరోనా మరణాలు సంభవించాయి.

కరోనా బారినపడి రాష్ట్రవ్యాప్తంగా 4 మరణాలు రెండు నమోదయ్యాయి. ఈ మేరకు గురువారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 41,671 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 179 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,85,616కి చేరింది.ఇక ఇలాంటి మరెన్నో కరోనా అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: