ఒక్కోసారి మనం తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల ఎన్నో ఇబ్బందులకు గురి అవుతూ ఉంటాము.ఏదో సరదాకి చేసిన ఒక చిన్న పొరపాటు కూడా ఒక్కోసారి మనల్ని అనుకోని భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన  పరిస్థితులలోకి నెట్టివేస్తుంది. ఇప్పుడు ఒక ప్రముఖ కంపెనీకి చెందిన సీఈవో ఒకరు తాను చేసిన చిన్న పొరపాటు వల్ల భారీ మూల్యాన్ని చెల్లించాలిసిన పరిస్థితి వచ్చింది. ఇంతకీ అతను ఏమి చేసాడో తెలుసా. !ఎప్పటిదో కొన్ని ఏళ్ల నాటి ఓ ప్రాచీన కవితను తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఇంకేముంది అతని పని అయిపొయింది. ఆ ఒక్క పోస్ట్ కి కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వచ్చింది.అసలు ఇంతకీ ఆ ప్రాచీన కవితలో ఏముంది..? ఆ కవిత వల్ల అతను ఎందుకు అన్ని డబ్బులు నష్ట పోవాలిసిన పరిస్థితి వచ్చిందో తెలుసుకుందాం. !



చైనా దేశానికీ  చెందిన ఓ బిలియనీర్, మీట్యుయన్ సీఈవో వాంగ్ జింగ్ ఈ పరిస్థితిని ఎదుర్కున్నాడు. వాంగ్ జింగ్ చైనా చరిత్రకు సంబంధించిన 1100 ఏళ్లనాటి ఒక కవితలోని కొన్ని పంక్తుల్ని  తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.అదే ఆయన చేసిన పొరపాటు. పోస్ట్ చేస్తే చేసాడు ఆ కవిత ఎమన్నా పక్క దేశానికీ చెందినదా అంటే అది కాదు.సాక్షాత్తు చైనా చరిత్రకు సంబంధించినదే అవ్వడం గమనించాల్సిన విషయం.


అయితే వాంగ్ జింగ్ పోస్ట్ చేసిన ఆ కవితలోని సారాంశం     ఎలా ఉందంటే.. చైనా మొట్టమొదటి చక్రవర్తి తనకు వ్యతిరేకంగా రేగుతున్న అసమ్మతిని అణచడానికి అతను చేసిన తప్పుడు ప్రయత్నాల గురించి పేర్కొనడం జరిగింది ఇంకేముంది ఆ కవిత చదివి అక్కడ ప్రభుత్వం వాంగ్ జింగ్ పై విరుచుకుని పడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాంగ్ జింగ్ పై ఆరోపణలు వెల్లు వెత్తాయి. వాంగ్ పోస్ట్ చేసిన కవితను చదివిన అనేక మంది అలాగే భావించారు. దీంతో సీఈవోగా ఉన్న మీట్యుయన్ కంపెనీ మార్కెట్ విలువ 26 బిలియన్ డాలర్ల(రూ.18,365 కోట్లు) మేర పడిపోయింది. అలా 1100 ఏళ్లనాటి కవితను తెలిసి చేసాడో లేక తెలియక చేసాడో గాని ఆ కవిత వాంగ్ జింగ్ కు పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: