గుజారాత్ కు చెందిన పిల్ల‌వాడిని ఇప్ప‌టికే రెండుసార్లు కిడ్నాప‌ర్లు కిడ్నాప్ చేశారు. రాష్ట్ర రాజ‌ధాని అయిన గాంధీన‌గ‌ర్‌కు చెందిన మురికివాడ‌ల్లో నివాసం ఉంటున్న భార్య‌భ‌ర్త‌ల‌కు ఒక కొడుకు ఉన్నారు. అయితే వీరి కొడుకును రెండు నెల‌ల గ్యాప్‌లో రెండుసార్లు కిడ్నాప్ చేశారు. రెండు నెల‌లున్న ఈ పిల్లాడిని కిడ్నాప‌ర్లు టార్గెట్ చేశారు. కాగా రెండుసార‌ర్లు పోలీసులు చాక‌చ‌క్యంగా కిడ్నాప‌ర్ల‌ను పట్టుకుని బాలుడిని కాపాడారు.

ఇలా రెండుసార్లు కిడ్నాపైన బాలుడిని పోలీసులు వెతికి ప‌ట్టుకుని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే ఇప్పటికే రెండుసార్లు కిడ్నాప్ కావ‌డంతో మ‌రోసారి ఈ బాబు కిడ్నాప్ కి గురి కాకుండా చూసేందుకు 24x7 గంటల ప్రొటెక్షన్ ఇవ్వాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఇక మురికివాడల్లో బాలుడి త‌ల్లిదండ్రులకు సెక్యూరిటీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు పోలీసులు.

ఇక రెండు నెలల్లో అనూహ్యంగా రెండుసార్లు కిడ్నాప్ చేయబడిన ఈ రెండు నెలల బాలుడికి గాంధీనగర్ లోని అడాలజ్‌లో రౌండ్-ది-క్లాక్ పోలీసులు రక్షణ ఇవ్వనున్నారు. అయితే గుజరాత్‌లోనే 24x7 పోలీసు రక్షణ కల్పించిన ఈ బిడ్డ బహుశా అతి పిన్న వయస్కుడు కావ‌చ్చు. ప్ర‌స్తుతం బాలుడి యొక్క తల్లిదండ్రులు మురికివాడ‌ల్లోనే నివసిస్తున్నారు.

అయితే బనస్కాంతలోని గాంధీనగర్ సివిల్ హాస్పిటల్ నుండి జిగ్నేష్ తోపాటు అస్మితా భారతి అనే కిడ్నాప‌ర్లు ఏప్రిల్‌లో బాలుడిని కేవలం రెండు రోజుల వయసున్న‌ప్పుడు అపహరించారు. అనంతరం పోలీసులు బాలుడిని వారంలోనే రక్షించారు. రెండోసారి జూన్ 5 న బనాస్వాడాకు చెందిన దినేష్ అత‌డి స్నేహితుడు సుధా కతారా బాలుడిని ఎత్తుకెళ్లారు. సీసీటీవి ఫుటేజీని ప‌రిశీలించి పోలీసులు నాలుగు రోజుల తర్వాత బాలుడిని కాపాడారు. పసికందును రెండుసార్లు కిడ్నాప్ చేసినందున, రెండు నెలల పిల్లవాడికి 24x7 పోలీసు రక్షణ కల్పించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అతని తల్లిదండ్రులకు శాశ్వత నివాసం కల్పించాలని పోలీసులు కూడా ఆలోచిస్తున్నారు. ఎంతైనా పోలీసులు గ్రేట్ క‌దా.

మరింత సమాచారం తెలుసుకోండి: