కొందరు అధికారులు సచివాలయాల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని జగన్ ఆరోపించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే అక్కడి సమస్యలు తెలుస్తాయన్నారు. తప్పులు జరిగితే... వాటిని పరిష్కరించుకునే అవకాశం ఉంటుందన్నారు జగన్. కలెక్టర్లు, జేసీ పనితీరుపై జగన్ పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్లు, జేసీలు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇదే తరహాలో అధికారులు కూడా పనిచేయాలని సూచించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో పాటు రైతు భరోసా, అర్బన్ హెల్త్ క్లినిక్కులు, తదితర అంశళాలుపై తాడేపల్లి క్యాంపు ఆఫీసు నుంచి రివ్యూ నిర్వహించారు. అటు పర్యాటక రంగం ప్రారంభం కావడంతో అన్ని ప్రదేశాలకు కూడా పర్యాటకుుల తాకిడి ఎక్కువగా ఉందని... థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జగన్ సూచించారు. అన్ని ఆసుపత్రుల్లో అవసరమైన వైద్య సదుపాయాలు సిద్ధం చేయాలన్నారు. అధికారులు తప్పనిసరిగా ప్రజలకు, ప్రభుత్వానికి జవాబుదారితనంతో పనిచేయాలని జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
కొందరు అధికారులు సచివాలయాల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని జగన్ ఆరోపించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే అక్కడి సమస్యలు తెలుస్తాయన్నారు. తప్పులు జరిగితే... వాటిని పరిష్కరించుకునే అవకాశం ఉంటుందన్నారు జగన్. కలెక్టర్లు, జేసీ పనితీరుపై జగన్ పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్లు, జేసీలు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇదే తరహాలో అధికారులు కూడా పనిచేయాలని సూచించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో పాటు రైతు భరోసా, అర్బన్ హెల్త్ క్లినిక్కులు, తదితర అంశళాలుపై తాడేపల్లి క్యాంపు ఆఫీసు నుంచి రివ్యూ నిర్వహించారు. అటు పర్యాటక రంగం ప్రారంభం కావడంతో అన్ని ప్రదేశాలకు కూడా పర్యాటకుుల తాకిడి ఎక్కువగా ఉందని... థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జగన్ సూచించారు. అన్ని ఆసుపత్రుల్లో అవసరమైన వైద్య సదుపాయాలు సిద్ధం చేయాలన్నారు. అధికారులు తప్పనిసరిగా ప్రజలకు, ప్రభుత్వానికి జవాబుదారితనంతో పనిచేయాలని జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.