టీఆర్ఎస్, బీజేపీ కి మధ్య రాజకీయంగా హోరాహోరీ నడుస్తోన్న సమయంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటన తెలంగాణ ప్రజల్లో పలు అనుమానాలను రేకెత్తించింది. ప్రధాని మోదీతో పాటు.. పలువురు కేంద్రమంత్రులతో కేసీఆర్ వరుసగా భేటీలు కావడం.. హుజూరాబాద్ ఉప ఎన్నిక అనూహ్యంగా వాయిదా పడడం ఒకేసారి జరిగాయి. దీంతో ఈ అంశం బీజేపీకి శాపంగా మారింది. ఇదే సమయంలో అధికారట టీఆర్ఎస్ కు రాజకీయంగా లాభింవచే అంశం. ఇదే అంశంపై ప్రస్తుతం తెలంగాణలో చర్చ జరుగుతోంది. కేసీఆర్ ఒత్తిడి మేరకే హుజురాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూలు వెలువడలేదన్న అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. టీఆర్ఎస్తో తెలంగాణ బీజేపీ గట్టిగా పోరాడుతున్నా.. ఢిల్లీలో బీజేపీ నేతలు కేసీఆర్ తో స్నేహంగా ఉండడం.. రాష్ట్ర పథకాలను కేంద్రమంత్రులు ప్రశంసించటం లాంటివి తెలంగాణ కమలనాధులకు మింగుడుపడడంలేదు. ఈనేపథ్యంలో ఈనెల 17న నిర్మల్ పర్యటన సందర్భంగా టీఆర్ఎస్పైన అమిత్ షా ఘాటుగానే విరుచుకుపడే అవకాశం ఉందని బీజేపీ నేతలంటున్నారు.
టీఆర్ఎస్, బీజేపీ కి మధ్య రాజకీయంగా హోరాహోరీ నడుస్తోన్న సమయంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటన తెలంగాణ ప్రజల్లో పలు అనుమానాలను రేకెత్తించింది. ప్రధాని మోదీతో పాటు.. పలువురు కేంద్రమంత్రులతో కేసీఆర్ వరుసగా భేటీలు కావడం.. హుజూరాబాద్ ఉప ఎన్నిక అనూహ్యంగా వాయిదా పడడం ఒకేసారి జరిగాయి. దీంతో ఈ అంశం బీజేపీకి శాపంగా మారింది. ఇదే సమయంలో అధికారట టీఆర్ఎస్ కు రాజకీయంగా లాభింవచే అంశం. ఇదే అంశంపై ప్రస్తుతం తెలంగాణలో చర్చ జరుగుతోంది. కేసీఆర్ ఒత్తిడి మేరకే హుజురాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూలు వెలువడలేదన్న అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. టీఆర్ఎస్తో తెలంగాణ బీజేపీ గట్టిగా పోరాడుతున్నా.. ఢిల్లీలో బీజేపీ నేతలు కేసీఆర్ తో స్నేహంగా ఉండడం.. రాష్ట్ర పథకాలను కేంద్రమంత్రులు ప్రశంసించటం లాంటివి తెలంగాణ కమలనాధులకు మింగుడుపడడంలేదు. ఈనేపథ్యంలో ఈనెల 17న నిర్మల్ పర్యటన సందర్భంగా టీఆర్ఎస్పైన అమిత్ షా ఘాటుగానే విరుచుకుపడే అవకాశం ఉందని బీజేపీ నేతలంటున్నారు.