అయితే గత మూడేళ్లుగా చిత్తూర్ జిల్లా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రోజా గారికి మరో ఉన్నతి లభించినట్లు సమాచారం. ప్రజల కోసం పాకులాడే తత్వం, ప్రత్యర్థులతో దీటుగా పోరాడే మనస్తత్వం ఉన్న ఈమె సేవలను మరింత పెంచేందుకు గాను రోజా గారికి మంత్రి పదవిని కట్టబెట్టాలని వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఇలాంటి వార్తలు వినిపించినప్పటికీ ఇపుడు ఆ దిశగా జగన్ సర్కారు నిర్ణయం ఉండబోతుందని తెలుస్తోంది. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్న తరుణంలో వైసిపి నేత రోజాకి ఈ అవకాశం రాబోతోందని తెలుస్తోంది.
తెలుగు సంవత్సరాది ఉగాది నుండి మరికొన్ని కొత్త జిల్లాలు మనుగడలోకి రాబోతున్న విషయం విదితమే. ఇప్పుడు ఆంధ్రలో ఉన్న జిల్లాలకు అదనంగా మరో 13 వచ్చి కలవనున్నాయి. దాంతో ఏపిలో మొత్తంగా 26 జిల్లాలుగా మారనున్నాయి. తొందరలోనే రెండవ సారి మంత్రి వర్గ విస్తరణను చేపట్టనున్నారు. ఈ విస్తరణలో ఎవరు మంత్రి పదవులు పొందనున్నారో? ఎవరు మంత్రి పదవి నుండి తొలగిపోనున్నారో తెలియాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి