ప్రధానంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేపడుతున్న పనులు సర్వేలు .. నిజాలు కాదు అనే విషయం పక్కన పెడితే .  ఈ సర్వే రిపోర్ట్ లో ఆధారంగా చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు మంత్రుల్లో తెగ టెన్షన్ పడుతున్నాయి .. రీసెంట్ గా విశాఖపట్నంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం చేసిన వ్యాఖ్యలు మంత్రులను తీవ్ర ఆందోళనకు గురిచేసాయి .. అయితే పైకి ఎవరూ చెప్పకపోయినా అంతర్గత చర్చలు మాత్రం మంత్రులు తెగ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .. అలాగే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను గమనిస్తే మంత్రులు ఇతర విషయాలలో వేలు పెడుతున్నారని.. ఇతర శాఖలో వ్యవహారాలను గమనిస్తూ వారి మంత్రి శాఖలను వదిలేస్తున్నారని  ఘాటైన వ్యాఖ్యలు చేశారు . రీసెంట్గా జరిగిన తెనాలి ఘటన తర్వాత పోలీస్ వ్యవహారం లో మంత్రి అనిత పై  మరో మంత్రి కామెంట్ చేయడం దీంతో ఈ వ్యాఖ్యలను ఉద్దేశించే చంద్రబాబు అన్నారని మంత్రులు గట్టి చర్చ జరుగుతుంది ..


ఇదే సమయంలో మంత్రి సబితకు సంబంధించిన శాఖలో మరో మంత్రి వేలు పెట్టడం కూడా చంద్రబాబు చేసిన వ్యాఖ్య‌ల‌కు పర్యవసారంగా మారిందని మరికొందరు అంటున్నారు .. అయితే ప్రస్తుతం టిడిపి మంత్రులు వ్యవహర శైలి పైన చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసిన .. అంతర్గత చర్చలో మాత్రం అందరి పైన  ఇది వర్తిస్తున్నట్టుగా మంత్రులు అంటున్నారు .. వైద్య ఆరోగ్యశాఖలో తాజాగా జరిగిన బదిలీలు కొంత హాట్ టాపిక్ గా మారాయి ..అంతేకాకుండా విద్యాశాఖలో కూడా టీచర్ల బదిలీలు కొంత వివాదానికి దారితీసాయి .. ఈ రెండు విషయాలను టిడిపిలో ఉన్న మంత్రులే జోక్యం చేసుకున్నారనేది టిడిపి అనుకూల మీడియాలో వచ్చిన వార్తల బట్టి తెలుస్తుంది .. ఇక ఈ రెండు విషయాలను కూడా ముఖ్యమంత్రి ఎంతో పరోక్షంగా ప్రస్తవించడం అందుకే ఆయన సర్వేల రిపోర్ట్ పేరుతో మంత్రులను గట్టిగా వార్నింగ్ ఇచ్చారని వాదన కూడా వినిపిస్తుంది .  అలాగే మంత్రుల విషయంలో చంద్రబాబు గతంలో కంటే ఇప్పుడు ఇంకా గట్టిగా స్పందించడం హెచ్చరించడం వంటివి స్పష్టంగా ఈసారి కనిపిస్తుంది .


ఇక దీంతో చంద్రబాబు చేసిన వ్యాక్య‌ల‌తో అయినా ఆ మంత్ర‌లు మారుతారా లేక మంత్రుల్ని చంద్రబాబు మార్చేస్తారా అనేది .. ఏ ఇద్దరు మంత్రులు కలిసిన ఈ విషయాలు చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది .  అయితే ఇప్పటికి ఇప్పుడు ఎలాంటి చర్యలు ఉండబోవని మరో రెండు మూడు నెలల పాటు వేచి చూసిన తర్వాత వివాదాస్పద మంత్రులపై కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయనే మాట గట్టిగా వినిపిస్తుంది .. అదే విధంగా మంత్రుల మధ్య సఖ్యత లేదని విషయాన్ని కూడా చంద్రబాబు పరిశీలనకు వచ్చింది . ఇక మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి ఏదేమైనా ఎన్ని సర్వేలు వచ్చినా కొందరు మాత్రం ఏది పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారనేది మాత్రం నిజం.

మరింత సమాచారం తెలుసుకోండి: