అలాగే అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేట ఏర్పాటు చేస్తారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అశాస్త్రీయ విభజనను సరిదిద్దేందుకు ఇప్పుడు మార్పులు , చేర్పులు చేయాలని సూచిస్తున్నారు. ఇక తూర్పు ఏజెన్సీ లోని చింతూరు, రంపచోడవరం డివిజన్ల పరిధిలోని గ్రామాలు జిల్లా కేంద్రమైన పాడేరుకు చాలా దూరంలో ఉండడంతో అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రెండు డివిజన్లతో ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేసినా చాలా చిన్నది అవుతుంది.
అందుకే ఈ రెండు డివిజన్లను తూర్పు గోదావరి జిల్లాలో కలపాలని ప్రతిపాదించారు. ఇప్పటికే ఏపీలో 26 జిల్లాలు ఉన్నాయి. అందుకే ఈ రెండు డివిజన్లను తూర్పు గోదావరి జిల్లాలో కలపాలని నిర్ణయించారు. అదే జరిగితే అప్పుడు తూర్పు గోదావరి జిల్లాలోని మండలాల సంఖ్య 19 నుంచి 30కి పెరుగుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు రెవెన్యూ డివిజన్ మాత్రమే ఉంటుంది. 11 మండలాలకే పరిమితమవుతుంది.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి