ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో వరుసగా రోడ్డు ప్రమాదలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ రూల్స్ ఎన్ని కఠినంగా తీసుకు వస్తున్నా ఈ రోడ్డు ప్రమాదాల సంఖ్య మాత్రం తగ్గకుండా పోతుంది. దీని వల్ల కుటుంబ సభ్యులు అనాధలుగా మిగులుతుంటే..కొంత మంది అంగవైకల్యంతో బాధపడే పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్యయ్య ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరి మనవడు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషాద సంఘట నగరంలోని నానక్రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్లో జరిగింది.
బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. కాగా, పోలీసులు తెలిపిన వివరణ ప్రకారం వరంగల్ జిల్లా, హన్మకొండ టీచర్స్ కాలనీలో నివాసం ఉండే తెలంగాణ కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య చెల్లెలు మాధవి, కరుణాకర్ దంపతుల కుమారుడు కొడూరి ధృపద్ (22) నగరంలోని ఖాజగూడలో ప్రైవేట్ ఫెయింగ్ గెస్ట్ హాస్టల్లో నివసిస్తున్నాడు. ప్రస్తుతం ధృపద్ మాదాపూర్ లో డిజిటల్ మార్కెటింగ్ కోర్సు లో చేరి చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం 4.30 గంటల కు తన మిత్రుడు హాస్టల్ లో డ్రాప్ చేసేందుకు వెళ్లారు.
తన మిత్రుడు కృష్ణ చైతన్యను నానక్రాంగూడ ఐటీ కారిడార్లోని క్యూసిటీ ఐటీ పార్క్ సమీపంలో దించేందుకు తన పల్సర్ వాహనం(టీఎస్03ఈక్యూ8223)పై బయలుదేరాడు. కృష్ణ చైతన్యను దించి తిరుగుప్రయాణంలో క్యూసిటీ నుంచి విప్రో సర్కిల్ వైపు వేగంగా వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఉన్నట్టుండి బైక్ అదుపు తప్పి డివైడర్ ని ఢీ కొంది. దాంతో బైక్ పల్టీ కొట్టడంతో విప్రో సర్కిల్ వద్ద ఆగి ఉన్నకారులను బలంగా ఢీకొట్టింది. దాంతో తీవ్ర గాయాలపాలైన ధృపద్ అక్కడిక్కడే మృతి చెందాడు. రోడ్డు ప్రమాదం జరిగిందని తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు..అప్పటికే మృతి చెందిన ధృపద్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అం దించారు.
రోడ్డు ప్రమాద ఘటనపై సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించగా.. బైక్ను వేగంగా నడపడంతో ఆది విప్రో సిగ్నల్ వద్ద కంట్రోల్ కాక పక్కనే ఉన్న డివైడర్కు ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉన్న తమ మనవడు అకస్మాత్తుగా కన్ను మూయడంపై కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పొన్నాల లక్ష్మయ్య ఉస్మానియా మార్చురీలో ఉన్న ధృపద్ మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.