
విమానాశ్రయ అధికారులు తనను ఓ క్రిమినల్లా చూస్తున్నారని, తాను భోపాల్కు ట్రైనింగ్ కోసం వెళుతున్నానని, తనను ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అధికారులు అడ్డగించారని, తనను విమానం ఎక్కకుండా నిర్బంధిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాలను తన ట్విటర్ ఖాతా ద్వారా ఆమె వెల్లడించారు. ‘నేను భోపాల్ వెళ్లాలి. నాతో పాటు షూటింగ్ కిట్ ఉంది. దానిని చూసిన ఎయిర్పోర్టు అధికారులు విమానం ఎక్కకుండా నన్ను ఆపేశారు. మారణాయుధాలు తీసుకెళుతున్నందుకు నన్ను నిలిపినట్లు చెప్పారు. నా దగ్గర పర్మిట్ ఉందని చెప్పినా వినిపించుకోలేదు.

ఇదిలా ఉంటే తనను క్రిమినల్లా చూశారంటూ షూటర్ మనుభాకర్ చేసిన ఆరోపణలను ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయ అధికారులు తోసిపుచ్చారు. ఆమె చేస్తున్న ఆరోపణలు ఏమాత్రం నిజాలు కావని అన్నారు. ఆమె వద్ద ఉన్న ఆయుధాలకు సంబంధించిన పర్మిషన్ పత్రాలను మాత్రమే చూపించాలని సిబ్బంది కోరారని ఎయిర్లైన్స్ యాజమాన్యం తెలిపింది. ఒకవేళ పత్రాలు లేకుంటే దానికి తగిన రుసుము చెల్లించాల్సి ఉంటుందని, అంతేకానీ ఎవరూ ఆమెను లంచం అడగలేదని తెలిపారు. ఆమెనే కాదని, ఆ స్థానంలో ఎవరు ఉన్నా వారు అలానే ప్రవర్తించేవారని, తమకు తమ ప్రయాణికుల యోగక్షేమాలు ఎంతో ముఖ్యమని, వారిని చిన్న ఇబ్బందికి గురి చేయడానికి కూడా తాము ఇష్టపడమని, కానీ అంతా నిబంధనల ప్రకారం జరిగితే అందరికీ మంచిదని చెప్పుకొచ్చారు.