ప్రముఖ గ్లామర్ బ్యూటీ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకవైపు బుల్లితెర షోలు చేసి భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె.. ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. ఇటీవల విమానం సినిమాతో భారీ క్రేజ్ సొంతం చేసుకున్న అనసూయ ఇప్పుడు పుష్ప 2 సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే . ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ఈమె మరొకవైపు తాజాగా నటించిన చిత్రం పెదకాపు -1..

హీరో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో కొత్త హీరో విరాట్ కర్ణా తో ఈ సినిమా రాబోతోంది. ఒక గ్రామంలో కులం మధ్య జరిగే గొడవలు నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఇందులో యాంకర్ అనసూయ అక్కమ్మ అనే కీలక పాత్రలో నటిస్తోందట.  ఈ విషయాన్ని ఆమె తాజాగా వెల్లడించారు. సెప్టెంబర్ 29వ తేదీన థియేటర్లలోకి విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు.  అందులో భాగంగానే అనసూయ మాట్లాడుతూ తన క్యారెక్టర్ గురించి వివరించింది.

సాధారణంగా అనసూయ మాట్లాడుతుందంటే చాలు పెద్ద ఎత్తున అభిమానులు సందడి చేస్తారన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా అనసూయ అలా మైక్ తీసుకుందో లేదో ఒక్కసారిగా అక్కడున్న ఆడియన్స్ అందరూ పెద్ద ఎత్తున కేకలు వేస్తూ గోల చేయడంతో..ఆమె ఇలా మైక్ తీసుకొని మాట్లాడుతూ.. మీరు ఇలా అరవడంతో నన్ను పొగుడుతున్నారా ? లేక తిడుతున్నారా?  అర్థం కావడం లేదు అంటూ కామెంట్ చేసింది. అనసూయ మాట్లాడుతూ.. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించినప్పుడు అందరూ నన్ను రంగమ్మత్త అనే పేరుతోనే పిలిచారు.  ఇప్పుడు ఈ సినిమాలో అక్కమ్మ పాత్ర పోషిస్తున్నాను. ఇక ఇప్పటినుంచి అక్కమ్మ గా  నన్ను పిలుస్తారేమో అంటూ కామెంట్ చేసింది. మొత్తానికైతే అనసూయ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: