ఏపీలో కరోనా కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇవాళ ఒక్క రోజే కొత్తగా 12 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 432కు చేరుకుంది. నిన్నరాత్రి 09 గంటల నుంచి ఇవాళ ఉదయం 09 గంటల వరకూ కొత్తగా 12 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
గుంటూరులో కొత్తగా 08 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడం గమనార్హం. చిత్తూరు జిల్లాలో 02, కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కో కేసు న మోదయ్యాయి. గుంటూరులో 90 కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మాత్రం రోజుకు రోజుకూ కరోనా మహమ్మారి ప్రబలుతోంది.
కర్నూలు జిల్లాలో 84, నెల్లూరులో 52, ప్రకాశం 41, కృష్ణా జిల్లాలో 36, కడపలో 31 కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే.. 12 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ ఏడుగురు మరణించారు. ప్రస్తుతం దవాఖానల్లో 413 మంది చికిత్స పొందుతున్నారు.