ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు టీడీపీ  కి షాక్ ఇచ్చిన రెబల్ ఎమ్మెల్యేలు ముగ్గురు కూడా ఎవరికి ఓటు వేసారు అనే ఆసక్తి అందరిలో నెలకొంది. మద్దాలి గిరి కరణం బలరాం గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఎవరికి ఓటు వేసారు అనే దానిపై పెద్ద చర్చ జరిగింది.

 

దీనిపై మద్దాలి గిరి స్పందించారు. తనకు అసలు విప్ అందలేదు అని ఓడిపోయే సీటు కి దళితులను నిలబెట్టడం వారిని అవమానించడమే అని ఆయన ఆరోపణలు చేసారు. ఇక చంద్రబాబు తన బ్యాచ్ ని పక్కన పెట్టకపోతే మాత్రం ఇబ్బందులు వస్తాయని హెచ్చరించారు. తనకు అసలు విప్ అందలేదు అని కాని తాము మాత్రం టీడీపీకే ఓటు వేశామని ఆయన స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: