ప్రపంచ మహమ్మారి కరోనా జోరుగా విజృంభిస్తోంది. మన దేశంలో రోజుకు ఏకంగా 28 వేల కేసులు నమోదు అవుతున్నాయి. ఇక బాలీవుడ్ను సైతం కరోనా వెంటాడుతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, జూనియర్ ఆర్టిస్టులు కరోనా భారీన పడ్డారు. ఇక ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ బిగ్ బీ అమితాబచ్చన్తో పాటు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్కు సైతం కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో పలువురు అమితాబ్ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే మరో బాలీవుడ్ సెలబ్రిటీ అనుపమ్ ఖేర్ కుటుంబంలో పలువురికి కరోనా సోకింది. అనుపమ్ ఖేర్ మినహా మిగిలిన వారు అందరికి కరోనా వచ్చింది. అనుపమ్ తల్లి, వదినతో పాటు మేనకోడలికి సైతం కరోనా సోకింది. దీంతో వారందరిని క్వారంటైన్కు తరలించారు. బాలీవుడ్ సెలబ్రిటీలను సైతం కరోనా వెంటాడుతుండడంతో దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.