హైదరాబాద్ లోటస్ పాండ్లోని వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు కండువా మార్చుకుంటున్నారు. మాజీ మంత్రి శ్రీపతి రాజేశ్వరరావు మనవరాలు శిల్పాచారి ఈరోజు వైఎస్సార్టీపీ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఎంతో కష్టపడ్డారని, రైతులకు ఉచితంగా విద్యుత్తు ఇవ్వడంతోపాటు విద్యార్థులు ఉన్నత విద్య చదువుకునేందుకు ఫీజు రీ ఎంబర్స్ మెంట్ వంటివి ప్రజల జీవనముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేశాయని శిల్పాచారి అన్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే ధ్యేయంగా షర్మిల పనిచేస్తున్న తీరుకు ఆకర్షితురాలినై పార్టీలో చేరుతున్నట్లు ఆమె చెప్పారు. ఎక్కువగా నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాలకు చెందినవారు ఈ పార్టీవైపు మొగ్గుచూపుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీతోపాటు బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నుంచి కూడా తమ పార్టీలోకి వలసలు కొనసాగుతాయనే ధీమాను షర్మిల వ్యక్తపరుస్తున్నారు.
హైదరాబాద్ లోటస్ పాండ్లోని వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు కండువా మార్చుకుంటున్నారు. మాజీ మంత్రి శ్రీపతి రాజేశ్వరరావు మనవరాలు శిల్పాచారి ఈరోజు వైఎస్సార్టీపీ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఎంతో కష్టపడ్డారని, రైతులకు ఉచితంగా విద్యుత్తు ఇవ్వడంతోపాటు విద్యార్థులు ఉన్నత విద్య చదువుకునేందుకు ఫీజు రీ ఎంబర్స్ మెంట్ వంటివి ప్రజల జీవనముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేశాయని శిల్పాచారి అన్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే ధ్యేయంగా షర్మిల పనిచేస్తున్న తీరుకు ఆకర్షితురాలినై పార్టీలో చేరుతున్నట్లు ఆమె చెప్పారు. ఎక్కువగా నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాలకు చెందినవారు ఈ పార్టీవైపు మొగ్గుచూపుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీతోపాటు బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నుంచి కూడా తమ పార్టీలోకి వలసలు కొనసాగుతాయనే ధీమాను షర్మిల వ్యక్తపరుస్తున్నారు.