తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ విపక్షాలను టార్గెట్ గా చేసుకుని ఘాటు వ్యాఖ్యలు చేసారు. కరోన సమయంలో కనిపించని జనసేన, టీడీపీ పెద్దమనుషులు  ఈరోజు కనిపిస్తున్నారని మండిపడ్డారు. కరోనా సమయంలో ఇళ్లల్లో కూర్చొని ఇప్పుడు పరామర్శ అంటు తిరుగుతున్నారు అని విమర్శించారు. కరోనా సమయంలో ప్రాణాలకు సైతం లెక్కచెయకుండా ప్రజల కోసం మేము పనిచేసాం అని ఆయన చెప్పుకొచ్చారు.

కరోనా పై సీఎం జగన్ చేసిన పనులకు ప్రధాని సైతం ప్రశంసించారు అని కొనియాడారు. కరోనా వచ్చిన వారిని అన్నిరకాలుగా జగన్ ప్రభుత్వం ఆదుకుంది అని ఆయన ప్రస్తావించారు. మొన్న కాపులు అంటు ఒకనాయకుడు తిరిగాడు అని ఈరోజు పెద్దపెద్ద భవనాల్లో ఉన్న వాళ్ళ కోసం ఇంకో నాయకుడు తిరుగుతున్నాడు అని మండిపడ్డారు. ప్రజల కోసం అన్ని పార్టీవాళ్ళు కృషి చెయ్యాలి కానీ బాగా పనిచేసిన మాపై బురద చల్లటం సరికాదు అని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: