ఏపీ సీఎం జగన్‌ను అమెరికన్ తెలుగు అసోసియేష‌న్ .. ఆటా ప్రతినిధులు కలిశారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో వీరు సీఎం జగన్‌ను మ‌ర్యాద‌పూర్వకంగా క‌లిశారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జూలై 1 నుంచి 3వ తేదీ వ‌ర‌కు ఆటా సమావేశాలు నిర్వహించబోతున్నారు. వాషింగ్టన్ డీసీలో నిర్వహించ‌నున్న ఈ 17వ అమెరిక‌న్ తెలుగు అసోసియేష‌న్.. ఆటా మ‌హా స‌భ‌ల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను వారు ఆహ్వానించారు. ఈ మేరకు ఆటా ప్రతినిధులు ఆహ్వాన పత్రికను సీఎం జగన్‌కు అందించిన తప్పకుండా రావాలని జగన్‌ను వారు ఆహ్వానించారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన వారిలో ఆటా ప్రెసిడెంట్‌ భువనేష్‌ బూజల, ఆటా సెక్రటరీ, నార్త్‌ అమెరికాలో ఏపీ ప్రభుత్వ సలహాదారు హరిప్రసాద రెడ్డి లింగాల ఉన్నారు. వారిలో పాటు ఆటా ఫైనాన్స్‌ కమిటీ చైర్మన్‌ సన్నీ రెడ్డి, ఆటా అడ్వైజరీ కమిటీ చైర్మన్‌ జయంత్‌ చల్లా కూడా సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: