
ఈ కేసులో తానేమీ తప్పించుకోలేదని.. న్యాయస్థానం ముందు అందరు నిలబడాల్సిందే అని వ్యాఖ్యానించారు. కేసు అక్రమమా సక్రమమా అనేది పక్కన పెడితే ఈ అంశంపై సుప్రీంకోర్టు లో స్టే ఉంది. ఎందుకు ఉంది అంటే ఓటుకు నోటు కేసు అనేది సీఆర్పీసీ కిందకు వస్తుందా.. లేక పీపుల్స్ రిప్రంజెంటివ్ చట్టం కిందకు వస్తుందా అనే అంశం ముందు తేలాలి. విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే సీఎఆర్పీసీ చట్టం వర్తిస్తుంది.
ఓటు వేసేందుకు ఏదైనా ప్రలోభాలు ఆశ చూపెడితే ఆ కేసును ఏసీబీ అధికారులు విచారిస్తారా లేక ఎన్నికల అధికారులు విచారిస్తారా. అందుకే నేను సుప్రీంకోర్టుని ఆశ్రయించాను. ఈ కేసుకు సంబంధం లేని సంస్థలు విచారిస్తున్నాయి. ఉదా. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తిపై మర్డర్ కేసు పెడితే ఎలా ఉంటుందో నాపై కూడా సంబంధం లేని కేసు పెట్టి ఇరికించారు. అందుకే నేను కోర్టుని కోరాను. ఏ అంశమై కేసు పెడితే ఆ కోర్టు పరిధికి వెళ్తాను అని సుప్రీంకోర్టుకు విన్నవించుకున్నాను అంతే తప్ప మరే ఇతర కారణాలు లేవని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.