అయితే మాధవ్ మాటలు ఉక్కు ఉద్యమంలో మంటలే రేపాయి. అసలే ఆరు నెలలుగా పోరాటం చేస్తూంటే కనీసం పరామర్శించడానికి కూడా తీరిక లేని బీజేపీ నాయకులు తీరి కూర్చుని ప్రైవేట్ కు సపోర్ట్ చేయడం ఏంటని వారు మండిపడుతున్నారు. మా ఉద్యోగాల మాట పక్కన పెడితే ముందు మీరు ఎమ్మెల్సీ ఉద్యోగానికి రాజీనామా చేయాల్సిందే అని పట్టుబడుతున్నారు. దీంతో మాధవ్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.
అంతకు ముందు కూడా మాధవ్ ఉక్కు ప్రైవేటీకరణ మీద ఇలాగే మాట్లాడారని వారు అంటున్నారు. ఇదిలా ఉంటే అసలే విశాఖలో బీజేపీ ఉనికి పోరాటం చేస్తోంది. కాస్తో కూస్తో బలం ఉందనుకున్న చోట ఉక్కు సెగ కనుక తగిలితే మొత్తానికి మొత్తం పోతుందని కమలనాధులు కలవరపడుతున్నారు. అంతకు ముందు జీవీఎంసీలో నలుగురు కార్పోరేటర్లను బీజేపీ గెలుచుకుంది. ఈసారి మాత్రం ఒక్కరే గెలిచారు.
ఇక 2019 ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తే టోటల్ గా డిపాజిట్లు కూడా బీజేపీకి పోయాయి. ఇపుడు ఉక్కు సెగతో కమలం పార్టీకి కష్టాలు పొంచి ఉన్నాయని అంటున్నారు. మరో వైపు కేంద్రంలో బీజేపీకి కూడా ఆదరణ తగ్గుతోంది. ఏపీలో టీడీపీతో పొత్తు కనుక లేకపోతే ఈసారి కూడా నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చే చెత్త రికార్డు ఖాయంగా కనిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి