పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల మనం ఖచ్చితంగా చాలా అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం వీలైనంత త్వరగా ఈ సమస్య నుండి ఈజీగా బయటపడాలి. పొట్ట చుట్టూ కొవ్వును కరిగించుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరగక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కేవలం మన ఇంట్లో ఉండే పదార్థాలతో కషాయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును చాలా సులభంగా కరిగించుకోవచ్చు. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించే కషాయాన్ని ఎలా తయారు తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక ఈ కషాయాన్ని తయారు చేసుకోవడానికి మనం ఒక టీ స్పూన్ జీలకర్రను ఇంకా ఒక టీ స్పూన్ మెంతులను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గ్లాస్ నీళ్లల్లో జీలకర్ర ఇంకా మెంతులు వేసి కలపాలి.తరువాత దీనిపై మూత పెట్టి రాత్రంతా కూడా నానబెట్టాలి. ఇలా నానబెట్టుకున్న తరువాత ఈ నీటిని గిన్నెలోకి తీసుకోని ఆ తరువాత ఈ నీటిని 4 నుండి 5 నిమిషాల పాటు మరిగించాలి. ఇలా మరిగించిన తరువాత ఈ కషాయాన్ని వడకట్టుకుని ఒక గ్లాస్ లోకి తీసుకోని ఇందులో అర చెక్క నిమ్మరసాన్ని పిండాలి. ఆ తరువాత అందులో రుచికి తగినంత తేనెను వేసుకోవాలి. అయితే డయాబెటిస్ తో బాధపడే వారు మాత్రం తేనెను వేసుకోకూడదు.


ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని ప్రతి రోజూ ఉదయం పూట పరగడుపున తాగాలి. ఇలా క్రమం తప్పకుండా తాగడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు చాలా ఈజీగా కరిగిపోతుంది. అలాగే శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు కూడా కరిగిపోతుంది. ఈ విధంగా కషాయాన్ని తాగుతూనే కొవ్వు పదార్థాలను తీసుకోవడం ఖచ్చితంగా తగ్గించాలి. జంక్ ఫుడ్ ని ఇంకా నూనె పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి. అలాగే ఖచ్చితంగా ప్రతిరోజూ వ్యాయామం చేయాలి.ఇలా చేయడం వల్ల మనం చాలా ఈజీగా బరువు తగ్గవచ్చు. ఈ కషాయాన్ని తాగడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరగడంతో పాటు మనం ఇతర ప్రయోజనాలను కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ కషాయాన్ని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఈజీగా అదుపులో ఉంటాయి. బీపీ నియంత్రణలో కూడా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్దకం, అజీర్తి ఇంకా అలాగే గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి.పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఇబ్బంది పడుతున్న వారు ఈ టిప్ వల్ల చాలా మంచి ఫలితాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: