మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా తెరకెక్కిన తాజా చిత్రం 'రిపబ్లిక్'.విభిన్న చిత్రాల దర్శకుడు దేవా కట్టా ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 1 న విడుదల కానున్న విషయం తెలిసిందే.అయితే ఈ సినిమాని ముందే చూసేసిన మన నేచురల్ స్టార్ నాని.. ఈ సినిమా గురించి తన ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు.తన సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా ఈ సినిమా గురించి తన అభిప్రాయాన్ని  తెలియజేస్తూ పలు ట్వీట్స్ చేసాడు నాని.'తాను రిపబ్లిక్ సినిమా చూశానని, సినిమా చాలా బాగుందని అన్నాడు.సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని మనం చేస్తున్న ప్రార్థనలు రిపబ్లిక్ రూపంలో తిరిగి వచ్చాయని నాని పేర్కొన్నారు.

సినిమా దేవా కట్టాకు మంచి కం బ్యాక్ ఫిల్మ్ అవుతుందని నాని తెలిపారు.ప్రస్థానం సినిమా తర్వాత దేవా కట్టా రాజకీయాలను బేస్ చేసుకొని సొసైటీకి అవగాహన కల్పించే విధంగా మంచి కథతో ఈ సినిమాను తెరకెక్కించారు.ఇక చిత్ర యూనిట్ కి నా ప్రత్యేక అభినందనలు'అంటూ నాని పేర్కొన్నారు.ఇక ఈ సినిమా గురించి నాని చేసిన ట్వీట్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఇక సీనియర్ నటులు జగపతిబాబు, రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించడం గమనార్హం.ఇక నానిసినిమా గురించి పాజిటివ్ గా చెప్పడంతో రిపబ్లిక్ సినిమాకు ఓపెనింగ్స్ బాగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ కి ఆడియన్స్ లమంచి రెస్పాన్స్ లభించగా, సినిమాపై కూడా అంచనాలను పెంచేసింది.దీంతో ఆడియన్స్సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ఏపీలో ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అవుతుండటం విశేషం.మరి ఇన్ని పాజిటివ్ వైబ్స్ ఉన్న ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్  ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరుతుందో చూడాలి.ఇక మరోవైపు తేజు ఆరోగ్యం గురించి మెగా బ్రదర్ నాగబాబు తో పాటూ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా స్పందిస్తూ.. తేజు ఆరోగ్యం నిలకడగానే ఉందని,అతను బాగానే కోలుకుంటున్నాడని చెబుతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: