నాగ్ తో ఈమె కలసి నటించిన సంతోషం, నేనున్నానని, మనం, ఊపిరి వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకున్నాయి. అయితే శ్రియకు ఈ మధ్య అవకాశాలు తగ్గిన విషయం తెలిసిందే. ఆండ్రీ కొచ్చివ్ తో వివాహం అనంతరం సోషల్ మీడియాలో బిజీగా మారి పోయిన శ్రియ మళ్ళీ ఇపుడు ఇండస్ట్రీ లో బిజీ అవ్వాలని కోరుకుంటుందట.
ప్రస్తుతం ఈమె మాస్ట్రో ఇళయ రాజా సంగీత సారథ్యంలో రూపు దిద్దుకుంటున్న మ్యూజికల్ చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’ లో నటిస్తుండగా..తాజాగా అక్కినేని నాగార్జునతో మరో సినిమాకి ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మధ్య నాగ్ కూడా సినిమాలు పెద్దగా కలసి రాని తరుణంలో తన లక్కీ హీరోయిన్ తో హిట్ కొట్టడం ఖాయమని అంటున్నారు. మరి ఇంతకీ వీరు నిజం గానే సినిమా చేయబోతున్నారా? ఏమిటా ఆ సినిమా...డైరెక్టర్ ఎవరు అన్న పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.
శ్రియ తెలుగులో అగ్ర తారగా ఒక వెలుగు వెలిగిన అందాల తార. దాదాపు ఇరవై ఏళ్ళు పాటు టాలీవుడ్ లో హీరోయిన్ గా వరుస అవకాశాలు అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. మనం సినిమాతో మళ్ళీ స్క్రీన్ పై సందడి చేసిన ఈ బామ ఊపిరి, గౌతమి పుత్ర కర్ణ వంటి చిత్రాలలో మరో సారి దూకుడు పెంచిన విషయం తెలిసిందే. మళ్ళీ నాగ్ తో సినిమాతో ఊపందుకుంటుందా చూడాలి.