టాలీవుడ్ హీరో, 'మా' ప్రెసిడెంట్ మంచు విష్ణు ఇంకా పాయల్ రాజ్ పుత్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమాకు తాజాగా జిన్నా అనే టైటిల్ ను ఫిక్స్ చేశామని అధికారిక ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే.రైటర్ కోన వెంకట్ ఈ సినిమాకు కథ అందిస్తుండగా భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక మోసగాళ్లు సినిమా తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకొని విష్ణు ఈ సినిమాలో నటించడం అనేది గమనార్హం. ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ కూడా ఇంకా రావాల్సి ఉంది.అయితే ఇక ఈ సినిమా టైటిల్ కు సంబంధించి బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడం కూడా గమనార్హం. విష్ణు జిన్నా పేరుతో నటిస్తున్న సినిమా టైటిల్ ను విత్ డ్రా చేసుకోవాలని ఆయన కోరారు. ఈ జిన్నా పేరుతో టైటిల్ ను ప్రకటించి వివాదానికి తెరలేపడం సిగ్గుచేటని ఆయన కామెంట్లు చేశారు. మూవీ పబ్లిసిటీ కొరకు శ్రీ వేంకటేశ్వర స్వామి ఏడు కొండల మీద ఇతర మతస్థుడైన జిన్నా పేరుమీద టైటిల్ ను రిలీజ్ చేయడం చాలా సిగ్గుచేటని ఆయన అన్నారు.


డైరెక్టర్ ఆర్జీవీ మాదిరిగా సినిమా పబ్లిసిటీ కొరకు ప్రయత్నించడం సరికాదని కూడా ఆయన తెలిపారు. హిందువులకు క్షమాపణలు చెప్పి ఆ టైటిల్ ను ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. అలాగే జిన్నా టవర్ ను తొలగించాలని మేము ఉద్యమం చేస్తున్నామని ఆయన తెలిపారు. విష్ణువర్ధన్ రెడ్డి కామెంట్ల విషయంలో కొందరు ఆయనను సపోర్ట్ చేస్తుంటే మరి కొందరు మాత్రం ఆయనను వ్యతిరేకిస్తున్నారు.ఇక మంచు విష్ణు ఈ కామెంట్ల గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. మంచు విష్ణు ప్రస్తుతం కెరీర్ విషయంలో చాలా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. దేనికైనా రెడీ సినిమా తర్వాత విష్ణు నటించిన సినిమాలేవీ అసలు కమర్షియల్ గా సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.ఇంకా అలాగే శ్రీనువైట్ల డైరెక్షన్ లో విష్ణు ఒక సినిమాను ప్రకటించినా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి అప్డేట్ రావాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: