ఛార్మితో కలిసి ఇందులో సత్య చేసిన పాత్రకు మంచి ఆదరణ దక్కింది. అప్పటి నుండి మంచి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తాజాగా ఇతని నుండి వస్తున్న మరో చిత్రం 'గాడ్సే'.. ఇతనికి కెరీర్ లో బ్లఫ్ మాస్టర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన గోపి గణేష్ దీనికి దర్శకత్వం వహిస్తుండడం ఆకట్టుకునే అంశం. ఇతని సినిమాలో ముఖ్యంగా స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటుంది. అంతే కాకుండా గోపి గణేష్ సమాజానికి ఉపయోగపడే కథలనే ఎంచుకుంటాడు. ఈ సారి విద్యావ్యవస్థ గురించి మంచి పాయింట్ ను డీల్ చేస్తున్నాడు. కానీ తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కథను ముందుగా పవన్ కళ్యాణ్ ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నాడట.
అయితే పవన్ కొన్ని సినిమాలు మరియు రాజకీయ అంశాలతో బిజీ గా ఉండడం వలన కుదరలేదట. అందుకే తనకు బాగా కలిసొచ్చిన హీరో సత్యదేవ్ తో తీశాడట. ఈ సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్ లలో ప్రత్యక్షం కానుంది. మరి పవన్ కు అనుకున్న సినిమాను సత్యదేవ్ తో తీశారు. మరి గణేష్ సమాజంపై తీస్తున్న ఈ సినిమా కూడా హిట్ అవుతుందా లేదా అన్నది చూడాలి.