చాలా రోజుల తర్వాత భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు హీరో కమల్ హాసన్. విక్రమ్ సినిమాతో ఎంత టి పెద్ద విజయాన్ని అందుకున్నారో అందరికీ తెలిసిందే. ప్రేక్షకులందరూ కూడా ఎంతగానో ఎదురు చూసిన ఈ సినిమా పై మొదటి నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. ఆ విధంగా కమలహాసన్ వచ్చి చాలా రోజులు అయిపోయిన నేపథ్యంలో చాలా రోజుల తర్వాత వచ్చిన ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. లోకేష్ కనకరాజన్ దర్శకత్వం వహిస్తున్నాయి సినిమా డ్రగ్స్ నేపథ్యంలో రూపొంది భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

చివర్లో సూర్య గెస్ట్ పాత్రలో అలరించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు. ఆయన పాత్ర ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం అని చెప్పవచ్చు. ఇక విజయ్ సేతుపతి,  ఫాహడ్ పజిల్ కూడా ఈ సినిమాలో ఇంత పెద్ద విజయాన్ని అందుకోవడానికి కారణం అయ్యారు అయితే ఈ సినిమా తర్వాత కమలహాసన్ ఈ చిత్రం యొక్క సీక్వెల్ పై పూర్తి దృష్టి పెట్టబోతున్న నేపథ్యంలో గతంలో ఆయన మధ్యలో ఆపేసిన సినిమాను మొదలు పెట్టాలా లేదా ఈ చిత్రం యొక్క సీక్వెల్ మొ దలు పెట్టాలా అన్న ఆలోచన చేస్తున్నాడు. 

శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2 సినిమాను మొదలుపెట్టి మధ్యలోనే ఆపేశాడు కమల్ హాసన్. నిర్మాతలకు మరియు దర్శకుడు కి మధ్య పొత్తు కుదరకపోవడంతో ఈ సినిమా మధ్యలోనే ఆపేయవలసి వచ్చింది. దానికి తోడు పలు యాక్సిడెంట్లు అవడం కూడా ఈ సినిమా ఆగిపోవడానికి కారణం అయ్యింది. అయితే ఎన్నో మంతనాల తరువాత కమలహాసన్ ఈ సినిమాను తిరిగి మొదలుపెట్టడానికి అందరిని ఓపించాడు. ప్రస్తుతం ఈ సినిమాను మొదలు పెట్టడానికి శంకర్ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో కమలహాసన్ ఏ సినిమా చేయాలో అన్న సందిగ్ధతలో ఉన్నాడు త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: