జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు... ఆయన ఎందరో హీరోల చేత మాస్ స్టెప్పులు వేయించి పాపులర్ అయ్యాడు.. డ్యాన్స్ తో పాటు పాలు టీవీ షో లు కూడా చేస్తున్నారు.అయితే ఆయన సోషల్ మీడియా ద్వారా ఏవో కామెంట్స్ రావడం జరుగుతూ వుంటుంది.వాటికి కొన్ని సార్లు లైట్ తీసుకుంటూన్న,మరి కొన్ని సార్లు కోపాన్ని తెప్పిస్తున్నాయి.ఇప్పుడు కూడా మరోసారి మాస్టర్ కు కోపం వచ్చింది.అంతలా ఏం జరిగిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…


టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు కోపం వచ్చింది. వచ్చిందే తడవుగా వార్నింగ్ కూడా ఇచ్చాడు నెటిజన్లకు. స్టార్ హీరోలకు .. భారీ బడ్జెట్ సినిమాలకు కొరియోగ్రఫర్ గా పనిచ చేసిన జానీ మాస్టార్ .. ఇటు తెలుగుతో పాటు అటు తమిళ,కన్నడ సినిమాలకు కూడా కొరియోగ్రఫర్ గా పనిచేశారు..తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జానీ మాస్టర్ .. కోపంతో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గతంలో జానీ మాస్టర్ ఈటీవీలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఢీ షో కి జడ్జిగా వ్యవహరించారు. ఢీ షోకి ఆయనకు చాలా దగ్గర అనుబంధం ఉంది..


షోలో డాన్స్ తప్ప అన్నీ ఉంటాయని.. మరీ ముఖ్యంగా కంటెస్టెంట్ డాన్స్ చేయడం మానేసి సర్కస్ చేస్తుంటారని.. ఈమధ్య మితిమీరిన రొమాన్స్ చేస్తున్నారని... అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు..వీటికి ఫైర్ అయ్యారు.ఇంకోసారి ఢీ షో గురించి ఎవరైనా సరే తప్పుగా మాట్లాడితే.. అస్సలకి ఊరుకోను అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో జానీ మాస్టర్ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల అవుతున్నాయి..ఆయన్ని కూడా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో కొందరు ట్రోల్ చేస్తున్నారు.ఢీ షో కి నీకు ఏంటి లింకు .. అసలునీకేంటి సంబంధం .. .ఆ షోని అంటే నీకేంటి నొప్పి.. అంటూ బూతులు తిడుతున్నారు. మరి ఈ కామెంట్స్ జానీ మాస్టర్ కంట పడ్డాయా..పడితే ఆయన స్పందన ఏంటి అనేది తెలియాల్సి ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: