నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన  పనిలేదు. అయితే ఈయన హోస్ట్ గా వ్యవహరిస్తున్న స్టాపబుల్ షో గురించి మనకి తెలిసిందే. అయితే  గత కొన్నిరోజులుగా అన్ స్టాపబుల్ సీజన్2 లో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కనిపించనున్నారంటూ వార్తలు తెగ వైరల్ అయ్యాయనే సంగతి తెలిసిందే. ఇక బాలయ్య పవన్ లను ఒకే స్క్రీన్ లో చూడబోతున్నామని వైరల్ అయిన వార్తలు అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించాయి.తాజాగా బాలయ్యకు పవన్ హ్యాండ్ ఇచ్చారని తెలుస్తోంది. బాలయ్య అన్ స్టాపబుల్ షోకు పవన్ హాజరు కాలేరని సమాచారం.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కారణాల వల్ల ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. 

అయితే మరో పదిరోజుల వరకు పవన్ కళ్యాణ్ ఇండియాకు రారని తెలుస్తోంది. పవన్  కళ్యాణ్ కు కూడా ఈ షోకు హాజరు కావడం విషయంలో పెద్దగా ఆసక్తి లేదని సమాచారం అందుతోంది. ఇక పవన్ హాజరు కావడానికి ఆసక్తి చూపని నేపథ్యంలో త్రివిక్రమ్ ఈ షోలో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తారో లేదో తెలియాల్సి ఉంది. అయితే బాలయ్య పవన్ ను ఒకే వేదికపై చూసే ఛాన్స్ అయితే మిస్ అయినట్టేనని చెప్పవచ్చు.ఇదిలావుంటే మరోవైపు సినిమాసినిమాకు పవన్ కళ్యాణ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. ఇక పవన్ తర్వాత సినిమా హరిహర వీరమల్లు రికార్డులు క్రియేట్ చేయడంతో పాటు అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఇకపోతే  క్రిష్ ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి రావడం గ్యారంటీ అని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.కాగా  క్రిష్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.పవన్ కళ్యాణ్ వరుసగా మూడు సినిమాలలో నటిస్తుండగా వచ్చే ఏడాది ఇదే సమయానికి ఈ సినిమాల షూటింగ్ పూర్తి కానుందని సమాచారం అందుతోంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీలో వరుస విజయాలను సొంతం చేసుకుంటుండగా తర్వాత సినిమాలతో పవన్ కోరుకున్న సక్సెస్ దక్కే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: