అక్కినేని
నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ
సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయడానికి చిత్ర బృందం రంగం సిద్ధం చేస్తుంది. కృతి శెట్టి
హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ఈ చిత్రం ఇటీవల వివాదంలో ఇరుక్కోవడం
సినిమా పట్ల ఎంతో ఆసక్తిని నెలకొల్పుతుంది అని చెప్పాలి. కర్ణాటకలో గ్రామంలో చిత్రం వేసిన సెట్ ను అభ్యంతరం చేస్తూ అక్కడి గ్రామస్తులు షూటింగ్ సెట్ పై దాడి చేశారు.
దాంతో వెంటనే అక్కడ షూటింగ్ను క్యాన్సల్ చేశారు ఫైనల్ గా ఈ
సినిమా యొక్క షూటింగ్ మళ్ళీ మొదలైంది ఆ విధంగా
నాగచైతన్య ఒక మంచి దర్శకుడు తో
సినిమా చేయడం విశేషం. థాంక్యూ సినిమాతో నిరాశగా ఉన్న
నాగచైతన్య ఇప్పుడు చేస్తున్న ఈ సినిమాతో ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటాడో చూడాలి. అయితే కొంతమంది హీరోలు ఒక
సినిమా సెక్స్ మీద ఉండగానే రెండు మూడు సినిమాలను ఓకే చేసుకుంటూ వాటిని కూడా మొదలు పెడుతున్నారు కానీ
నాగచైతన్య మెల్లగా ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉండడం ఆయన అభిమానులను నిరాశ పరుస్తుంది.
ఇతర
యువ హీరోల లాగా ఈ
హీరో కూడా నన్ను మూడు సినిమాలను అనౌన్స్ చేస్తే బాగుండేదని వారు కోరుకుంటున్నారు. వారు కోరుకున్న విధంగానే
నాగచైతన్య దానికి సంబంధించిన పనులను చేస్తున్నాడు వెంకట్ ప్రభు
సినిమా పూర్తయిన తర్వాత ఆయన
పరశురామ్ దర్శకత్వంలో
సినిమా చేయబోతున్నాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇంతవరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. త్వరలోనే రాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ దర్శకుడు తో మాత్రమే కాకుండా మరో ఇద్దరు
యువ దర్శకులతో కూడా ఆయన సినిమాలు చేయబోతున్నాడు. వారిద్దరూ ఇప్పటికే నాగచైతన్యకు కథలు చెప్పి డేట్ల కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలోనే వారిద్దరిలో ఒకరితో సినిమాను మొదలు పెట్టాలని
నాగచైతన్య భావిస్తున్నాడు.