నందమూరి బాలకృష్ణ పైనే యంగ్ హీరో శర్వానంద్ సాహసోపేతంగా డబుల్ మీనింగ్ డైలాగ్‌తో రెచ్చిపోయాడట . దానికి బాలయ్య ఇచ్చిన రియక్షన్‌కి శర్వానంద్‌ కి దిమ్మతిరిగిపోయిందట.

బాలయ్యని కొత్తగా ఆవిష్కరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్-2 మూడో ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రొమోని ఈరోజు విడుదల చేశారట.. శర్వానంద్, అడివి శేష్‌ కి కొంటె ప్రశ్నలు వేసిన నందమూరి బాలకృష్ణ చాలా సరదాగా మాట్లాడుతూ వారి నుంచి సమాధానాలు రాబట్టారు. ఆ క్రమంలో కాస్త చొరవ తీసుకున్న శర్వానంద్ డబుల్ మీనింగ్‌ డైలాగ్‌ వేశాడట. ఆ తర్వాత బాలకృష్ణ డబుల్ మీనింగ్ ప్రశ్నలతో వారిని తెగ ముప్పుతిప్పలు పెట్టాడు.

అడవి శేష్ వచ్చిరాగానే బాలకృష్ణ కాళ్లకి మొక్కాడు. దాంతో బాలయ్య చిన్న పిల్లలు దేవుడితో సమానం అలా కాళ్ల మీద పడిపోకూడదు అని కాస్త సీరియస్‌గా పేస్‌ పెట్టి అన్నాడట. దానికి అడవి శేష్ పెద్ద వాళ్లు దేవుడితో సమానం అని విన్నాను అంటూ వినయం నటిస్తూ రిప్లై ఇచ్చాడట.. పక్కనే ఉన్న శర్వానంద్'అతని పేరు బాలయ్య..

అతను ఇప్పటికీ బాల'అంటూ కూడా సెటైర్ పేల్చాడు. రష్మిక మంధానతో తనకి క్రష్‌ అని బాలయ్య గతంలో చెప్పడంతో శర్వానంద్ మీకు ఒక చిన్న గిప్ట్ సార్ అంటూ రష్మికతో వీడియో కాల్‌లో మాట్లాడించాడు. మీరు వందపైన సినిమాలు చేశారు కదా కనీసం ఓ పాతిక ముప్పై మంది హీరోయిన్లతోనైనా చేసుంటారు కదా.. అని బాలయ్యని శర్వానంద్ అడిగాడట.

దానికి పక్కనే ఉన్న అడవి శేష్.. చేసుంటారా.. అంటూ నవ్వేశాడు. దానికి అదేరా యాక్టింగ్ చేసుంటారు కదా.. అని శర్వానంద్ వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేశాడు. కానీ అప్పటికే బాలయ్యకి శర్వానంద్ వైపు కోపంగా చూస్తూ ఇవన్నీ'బి సెంటర్ వాడి తెలివితేటలు అంటూ గట్టిగా కౌంటరిచ్చాడట.. ఇలా సరదాగా సాగిపోయిన ఈ ఎపిసోడ్ ఈ నెల 4న ఆహాలో స్ట్రీమింగ్ అవనుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: