యంగ్టైగర్ ఎన్టీఆర్ రెండో రోజు కూడా జై లవకుశ సినిమాతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వీరంగం ఆడేశాడు. తొలి రోజే ఏపీ, తెలంగాణలో రూ 21.40 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా రెండో రోజు కూడా తన జోరు చూపిస్తూ రూ 6.28 కోట్ల షేర్ కొల్లగొట్టింది. రెండు రోజులకు కలుపుకుంటే కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఈ సినిమా షేర్ రూ.28 కోట్లను దాటేసింది. ఇక శని, ఆదివారాలు సెలవులు రావడంతో పాటు దసరా సెలవులు కూడా ప్రారంభమవ్వడం, స్పైడర్ సినిమా బుధవారం థియేటర్లలోకి వచ్చేవరకు జై లవకుశకు ఎదురు లేకపోవడంతో సినిమా వసూళ్లు భారీగా పెరగనున్నాయి.
ఇక ఓవర్సీస్లో శుక్రవారానికే మిలియన్ డాలర్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చేసి ట్రేడ్ వర్గాలకు దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చింది. అక్కడ కూడా శని, ఆదివారాలు వీకెండ్ కావడంతో అక్కడ కూడా వసూళ్ల వీరంగం సృష్టించనుంది. ఇక ఈ లెక్కన చూస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో ఫస్ట్ వీకెండ్కు ఈ సినిమాకు కలెక్షన్లు అదిరిపోనున్నాయి.
ఇక ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్లో మాత్రమే చూసుకుంటే రూ.35 కోట్ల షేర్ కనపడుతోంది. మిగిలిన లెక్కలు కలుపుకుంటే ఇది చాలా ఎక్కువగానే ఉండనుంది. ఇక రెండు రోజులకు ఏపీ+తెలంగాలో ఈ సినిమా షేర్ ఇలా ఉంది. ఇక రెండు రోజులకు వరల్డ్వైడ్ గ్రాస్ వసూళ్ల లెక్క రూ.80 కోట్లకు పై మాటే అని టాక్?
జై లవకుశ ఏరియా వైజ్ 2 డేస్ షేర్ :
నైజాం - 7.33 కోట్లు
సీడెడ్ - 5.60 కోట్లు
నెల్లూరు - 1.28 కోట్లు
గుంటూరు - 3.48 కోట్లు
కృష్ణా - 2.18 కోట్లు
వెస్ట్ - 2.15 కోట్లు
ఈస్ట్ - 3.39 కోట్లు
ఉత్తరాంధ్ర - 2.70 కోట్లు
-----------------------------------------------------
2 డేస్ ఏపీ+తెలంగాణ షేర్ = 28.11 కోట్లు
-----------------------------------------------------