తెలుగు ఇండస్ట్రీలో మహానటులుగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ‘విక్రమ్’ చిత్రంతో హీరగా ఎంట్రీ ఇచ్చారు అక్కినేని నాగార్జున. తెలుగు ఇండస్ట్రీలో మన్మధుడు, కింగ్ నాగార్జున గా పేరు తెచ్చుకున్న నాగార్జున నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో నాగార్జున తనయులు అక్కినేని నాగచైతన్య, అఖిల్ లు హీరోలుగా కొనసాగుతున్నారు.
ఈ మద్య నాగచైతన్య ప్రముఖ నటి సమంతను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో అక్కినే కుటుంబం అంటే ఎంతో గౌరవం ఉంది. ఆయన కుమారులు - కోడళ్ళు, కుమార్తెలు - అల్లుళ్ళు, మనవలు - మనవరాళ్ళు. సోమవారం అక్కినేని నాగార్జున-అమల వివాహ వార్షికోత్సవం సందర్భంగా కలుసుకున్నారు.
అప్పుడు తీసిన ఫొటోలను అఖిల్ ట్వీట్ చేశారు. ‘‘నేను ఎంతగానో ప్రేమించే నా తల్లిదండ్రులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. వాట్ ఏ లవ్ స్టోరీ’’ అని ట్వీట్లో పేర్కొన్నారు. అంతా బాగుంది కానీ..అక్కినేని నాగార్జున కోడలు, నాగచైతన్య సతీమణి సమంత ఈ ఫొటోల్లో లేకపోవడం చర్చనీయాంశం అయ్యింది. ‘సమంత ఎక్కడ?’ అంటూ పలువురు సోషల్ మీడియాలో సందేహాలు వ్యక్తం చేశారు.