టాలీవుడ్ లో మహేష్ బాబు ‘రాజకుమారుడు’ సినిమాతో హీరోగా పరిచయం అయినా..కృష్ణవంశి దర్శకత్వంలో వచ్చిన ‘మురారి’ సినిమాతో నటుడిగా మంచి పేరు సంపాదించాడు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన బాలీవుడ్ బ్యూటీ సొనాలీ బింద్రే హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత వీరిద్దరి జోడీ మళ్లీ కనిపించలేదు. ప్రస్తుతం సోనాలి బింద్రే హైగ్రేడ్ మెటా స్టేటిక్ క్యాన్సర్తో బాధపడుతుండగా, ప్రస్తుతం న్యూయార్క్లో చికిత్స పొందుతుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా తన క్షేమ సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తుంది.
సొనాలికి అనేకమంది సెలెబ్రిటీలు కలిసి ఆమెకు ధైర్యం చెప్పిన సంగతి తెలిసిందే. మొదటి నుంచి సోనాలి చాలా పాజిటివ్ గా ఆలోచించే మనస్తత్వం కలిగిన వ్యక్తి కావడంతో.. క్యాన్సర్ క్రిటికల్ స్టేజిలో ఉన్నట్టు తెలిసినా చాలా ధైర్యంగా పోరాటం చేసింది. ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యామిలీ న్యూయార్క్ నగరంలో ఉన్నది. మహేష్ తన 25 వ సినిమా మహర్షి షూటింగ్ కోసం న్యూయార్క్ నగరంలో ఉన్నాడు. నమ్రతా శిరోద్కర్ ఇటీవలే సొనాలికి కలిశారట. ఆమె చాలా ధైర్యంగా పాజిటివ్ గా ఉందని చెప్పారు.
ఓ ఆంగ్ల మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చిన నమ్రత.. సోనాలి గురించి మాట్లాడుతూ ఆమె చాలా శక్తివంతమైన మహిళ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నసోనాలి త్వరలోనే మాములు జీవితం గడపనున్నారు. ఆమెతో సరదా సమయం గడిపాను. అనారోగ్యానికి సంబంధించిన అన్ని విషయాలు చర్చించాం. సోనాలి ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని ఎల్లప్పుడు దేవుడిని ప్రార్ధిస్తూనే ఉంటాను అని మాట ఇచ్చాను.
చాలా తొందరగా ఆమె కోలుకుంటుందని, ఆమెకు మనోధైర్యం మెండుగా ఉందని చెప్పిన నమ్రత.. న్యూయార్క్ సెంట్రల్ పార్క్ లో వాకింగ్ చేయడానికి వస్తానని మాటిచ్చానని, సడెన్ గా మరో ప్లేస్ కి వెళ్లిపోవడంతో.. కుదరలేదని.. ఇచ్చిన మాటప్రకారం త్వరలోనే సోనాలితో కలిసి సెంట్రల్ పార్క్ లో వాకింగ్ చేస్తానని చెప్పింది నమ్రత. పలు తెలుగు సినిమాలలో సోనాలి బింద్రే నటించింది.