మనసులో మాటలు బయటపెట్టకుండా ఎప్పుడూ నవ్వుతూ కనిపించే మహేష్ లో వచ్చిన మార్పులు చూసి సుకుమార్ కలవర పడుతున్నట్లు టాక్. ‘రంగస్థలం’ విడుదలై ఇంచుమించు ఒక సంవత్సరం కావస్తున్నా సుకుమార్ మహేష్ తో తీయబోయే కథను ఇప్పటికీ ఫైనల్ చేసుకోలేక పోవడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

సాధారణంగా మహేష్ ఒకసారి తన సినిమాకు సంబంధించి దర్శకుడుని ఎంపిక చేసుకున్న తరువాత కథ విషయంలో పెద్దగా జోక్యం చేసుకోడు. కేవలం పూర్తి కథ కూడ వినకుండానే ‘బ్రహ్మోత్సవం’ కేవలం మురగదాస్ పై ఉన్న నమ్మకంతో ‘స్పైడర్’ సినిమాలు చేసి అవి ఘోరమైన ఫ్లాప్ లుగా మారిన తరువాత మహేష్ ప్రవర్తనలో మార్పులు వచ్చి ప్రస్తుతం మహేష్ ఏదర్శకుడుని పూర్తిగా నమ్మడం లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

ఇలాంటి పరిస్థుతులలో సుకుమార్ ఇప్పటి వరకు ఏటాప్ హీరోతోను ఎదుర్కొని విచిత్ర పరిస్థితి మహేష్ తో ఎదుర్కుంటున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో నడిచే సుకుమార్ కథకు మహేష్ ఓకె చెప్పినప్పటికీ ఈకధకు సుకుమార్ చెప్పిన క్లైమాక్స్ మహేష్ కు నచ్చకపోవడంతో మరో క్లైమాక్స్ ను ఆలోచించమని మహేష్ చెప్పినట్లు సమాచారం.

దీనితో మహేష్ ను ఒప్పించ గలిగే క్లైమాక్స్ గురించి సుకుమార్ టీమ్ ఆలోచిస్తున్నట్లు టాక్. ఇది ఇలా ఉండగానే మహేష్ మనసు దర్శకుడు అనీల్ రావిపూడి పై పడింది అని వార్తలు రావడం కూడ సుకుమార్ కు టెన్షన్ పెడుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి కథ విషయంలో సుకుమార్ మహేష్ ను మెప్పించలేకపోతే ఆఖరి నిముషంలో మహేష్ సుకుమార్ కు సారి చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తాడా అన్న అనుమానాలతో ‘రంగస్థలం’ లాంటి సూపర్ హిట్ తీసాక కూడ తనకు ఇదేమి పరిస్థితి అంటూ సుకుమార్ తన సన్నిహితుల వద్ద మధన పడుతున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: