క్రికెట్ ప్లేయర్స్ కు టాలీవుడ్ యాక్టర్స్ కు ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందో తెలియడం లేదు. క్రికెట్ ప్లేయర్స్ కైతే చేయటానికి ఏమీ ఉండదు. కాని అనవసరమైన రిస్క్ ఎక్కువగా చేసి గాయాల పాలవుతున్నారు మన హీరోలు. ఒక్కరిద్దరు కాదు యువ హీరోలంతా ఈ మధ్య ప్రమాదాల తో హాస్పిటల్ పడకలపై ట్రీట్మెంట్ పొందినవాళ్లే. ఇప్పటికీ శర్వానంద్, నాగశౌర్య, సందీప్ కిషన్ లాంటి వాళ్లు వైద్యల పర్యవేక్షణలోనే ఉన్నారు. వీళ్లంతా “విశ్రాంతి పేరుతో” కాలం గడిపేస్తున్నారు.
ఐతే ఎన్నడూ లేంది ఈ శాపం హీరోయిన్లకు కూడా వదలిపెట్టటం లేదు. “సైరా” షూటింగ్ జరుగుతున్న సమయంలో అనుష్క షెట్టి గాయపడిందనే వార్తలు వినిపిస్తు న్నాయి. ఈ సినిమా లో అత్యంత కీలకమైన ఝాన్సీ అనే శక్తివంతమైన పాత్రలో నటిస్తుంది స్వీటీ. అయితే ఈ గాయం తగిలిన తర్వాత కూడా ఆమె ఎలాంటి హంగామా చేయకుండా సహనంతో తొలుత ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసిందని తెలుస్తుంది. ఆమెను ఈ పాత్రకు దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రత్యేకంగా ఎంపిక చేశారట.
గతంలో చిరంజీవితో కలిసి స్టాలిన్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది స్వీటీ అనుష్క. ఇప్పుడు సైరాలో అత్యంత కీలకమైన పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయిపోయింది. దెబ్బ తగిలిన తర్వాత కాస్త చికిత్స తీసుకుని సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేసింది తెలుగువారి అరుందతి జేజమ్మ. దాంతో దెబ్బ గురించి వివరాలు బయటికి రాలేదు. ఇది జరిగి కూడా చాలా రోజులైందని తెలుస్తుంది.
ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ దెబ్బ తాలూకు సమస్య అనుష్కను ఇబ్బంది పెడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈమె “సైలెన్స్” సినిమాలో మాధవన్ కు జోడీగా నటిస్తుంది. కోన వెంకట్ కథ అందిస్తున్న ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు మధుకర్ తెరకెక్కిస్తున్నాడు. అమెరికా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాధవన్ హీరోగా నటిస్తుండగా, హాలీవుడ్ నటుడు మైఖెల్ మ్యాడ్సన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.