వరుస పరాజయాల తరువాత ఇటీవల చిత్రలహరి తో హిట్ కొట్టాడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. ఇక ప్రస్తుతం ఈ మెగా హీరో మారుతీ డైరెక్షన్ లో 'ప్రతి రోజు పండగే' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా గీతా ఆర్ట్స్ 2 , యువీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈక్రిస్మస్ కు ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇక ఈ సినిమా తరువాత సాయి ధరమ్ , ప్రస్థానం ఫేమ్ దేవకట్టా తో సినిమా చేయనున్నాడు. దేవా కట్టా చెప్పిన స్టోరీ లైన్ బాగా నచ్చడం తో వెంటనే సినిమా కు ఓకే చెప్పాడట. సోషల్ మరియు ఫామిలీ డ్రామా తో కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం డిసెంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో స్క్రీన్ ప్లే చాలా డిఫ్రెంట్ గా ఉండనుందట. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో వున్నాడు దేవకట్టా.
ఇక ఈసినిమా కాకుండా తేజూ మరో రెండు సినిమాలకు సైన్ చేశాడట. అందులో భాగంగా 'ఉయ్యాలా జంపాల' అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసినా సుబ్బు తో ఓ సినిమా కు కమిట్ అయ్యాడు. ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఈ సినిమాతో పాటు 'రగడ' ఫేమ్ వీరు పోట్ల డైరెక్షన్ లో కూడా ఓ సినిమా చేయడానికి సాయి ధరమ్ అంగీకరించనట్లు సమాచారం.