టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు టాలీవుడ్ సహా పలు ఇతర భాషల్లోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఇక బాలీవుడ్ లో అయితే, ఏకంగా అక్కడి చాలామంది హీరోయిన్స్ మహేష్ అంటే మనసు పారేసుకుంటుంటారు. ఇక మన టాలీవుడ్ నటుల్లో కూడా కొందరు మన సూపర్ స్టార్ కు వీరాభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఇక వారిలో మహేష్ బాబుకు పెద్ద ఫ్యాన్ అయిన టాలీవుడ్ యూత్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ,  ఓవైపు సినిమాల్లో హీరోగా నటిస్తూ, మరోవైపు ప్రొడక్షన్ హౌస్ ఒకటి స్టార్ట్ చేసి సినిమాలు తీయడం కూడా మొదలెట్టాడు. 

ఇక ఆయన తన కింగ్ ఆఫ్ ది హిల్ బ్యానర్ పై తీసిన తొలి సినిమా 'మీకు మాత్రమే చెప్తా'. యువ దర్శకుడు షమ్మీర్ సుల్తాన్ తెరకెక్కించిన ఈ సినిమాలో నటుడు మరియు దర్శకుడైన తరుణ్ భాస్కర్ హీరో పాత్రలో నటించగా, యాంకర్ అనసూయ, అభినవ్ గోమటం, వాణి భోజన్, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఇకపోతే తన తొలిసినిమా ట్రైలర్ ని అభిమాన హీరో మహేష్ తో లాంచ్ చేయించిన విజయ్, మహేష్ ను ట్రైలర్ రిలీజ్ వేడుకలో ఎంతో గొప్పగా పొగిడారు. అలానే మహేష్ బాబు కూడా విజయ్ పై తనదైన శైలిలో కొన్ని మెమొరబుల్ వర్డ్స్ తో  మెచ్చుకోవడం జరిగింది. 

ఈ కాంబినేషన్ ఎంతో కొత్తగా ఉంది, మొదట ఈ సినిమా గురించి వినగానే నాకు ఎంతో ఎంటర్టైనింగ్ గా అనిపించింది. అలానే తనకు ఈ సినిమా గురించి తెలుసునని, తప్పకుండా విజయ్ తొలి సినిమాతో మంచి హిట్ కొట్టాలని ఆశిస్తున్నట్లు ఎంతో స్వీట్ గా చెప్పారు మహేష్. ఇక నిన్న సాయంత్రం రిలీజ్ అయిన ఈ సినిమా థియేటరికల్ ట్రైలర్, ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకెళ్తోంది. యూత్ ని ఎంతో అట్రాక్ట్ చేస్తున్న ఈ ట్రైలర్, సినిమాపై బాగా అంచనాలు పెంచింది. ఇకపోతే ఈ సినిమాను నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: