ప్రతి సినిమా బాగుండాలని లేదు. అలాగే సినిమాలోని ప్రతి పాట బాగుండాలని లేదు. కాని కొన్ని సినిమాలోని పాటలు వినగానే ఆకట్టుకుంటాయి. మధురంగా వచ్చే పాటలతోనే సినిమా సగం వరకు హిట్ అనే టాక్ తెచ్చుకుంటుంది. ఇకపోతే ఈ మద్య విడుదలైన 'అల... వైకుంఠపురములో ని మూవీ సాంగ్ 'సామజవరగమన.. నినుచూసి ఆగగలనా'.. అనే పాట ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే.

 

 

విడుదలైన కొన్ని గంటల్లోనె అత్యదికంగా వ్యూస్ రాబట్టుకుంది.. ఇక ఈ సాంగ్‌కు ట్యూన్ థమన్ కంపోజ్ చెయ్యగా, సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ అత్యంత అద్బుతంగా సాగుతుంది. అది యంగ్ సెన్సేషన్ సిడ్ శ్రీరామ్ గొంతునుండి వయ్యారంగా జాలువారుతూ ప్రతి సంగీత ప్రియులను అలరించింది.. ఇకపోతే ఇదే పాటను ఫిమేల్ వెర్షన్ రికార్డ్ చేసారు చిత్రబృందం. రికార్డు క్రియేట్ చేసిన ఈ పాటను థమన్ మరోసారి కొత్తగా ప్రయోగం చేసి వదిలాడు.

 

 

ఇక కోకిల సైతం తన గాత్రాన్ని చూసి ముఖం చిట్లించే తీయని స్వరం ఉన్న ప్రముఖ గాయని శ్రేయా ఘోషాల్ ఈ పాటను ఆలపించారు. ఇకపోతే ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన వీడియోను తాజాగా థమన్ రిలీజ్ చేయగా. విన్న కొద్ది వినాలనిపించేటంతటి మధురంగా సాగే ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా దూసుకుపోతుంది. ఇకపోతే ఈ పాటలో ఎక్కువ ఎలక్ట్రానిక్ పరికరాలు లేకుండా.. వయొలిన్, పియానో, గిటార్, డ్రమ్స్, బేస్ గిటార్ వంటి వాయిద్యాలతో .. 70 మంది ఆర్కెస్ట్రా, 35 పీస్ బ్యాండ్‌తో ఈ సాంగ్ కంపోజ్ చేశానని థమన్ తెలిపారు..

 

 

సంక్రాంతి సంబరాలను తన చిత్రంతో అందించడానికి సర్వం సిద్దమైన  'అల... వైకుంఠపురములో' మూవీలో  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సరసన పూజా హెగ్డే, నివేధా పేతురాజ్ హీరోయిన్స్‌కాగా, టబు, సుశాంత్, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, జయరామ్, సునీల్, నవదీప్, రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో, గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్స్‌పై.. అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) కలిసి నిర్మిస్తున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: