తెలుగు చిత్రసీమలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరి ఇద్దరి మధ్య స్నేహం ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తుంది. అతడు, ఖలేజా సినిమాలతో పాటు పలు యాడ్స్ కూడా వీరు కలిసి చేశారు. అయితే ఇంత క్లోజ్‌గా ఉండే మహేశ్, త్రివిక్రమ్‌ల మధ్య కొంత గ్యాప్ వచ్చిందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇక ఈ గ్యాప్ సంక్రాంతి నుంచి మరింత ఎక్కువైనట్లు తెలుస్తోంది.

 

సంక్రాంతికి బాక్సాఫీస్ బరిలో మహేశ్ హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు, త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అల వైకుంఠపురములో చిత్రాలు పోటీ పడిన విషయం తెలిసిందే. ఇందులో సరిలేరు యావరేజ్ కలెక్షన్లతో ముందుకెళుతుండగా, వైకుంఠపురము సూపర్ కలెక్షన్లతో దూసుకెళుతుంది. అయితే సినిమా ప్రమోషన్లలో భాగంగా మహేశ్...బన్నీ సినిమా గురించి మాట్లాడినా, త్రివిక్రమ్ గురించి అసలు మాట్లాడటం లేదు. అటు త్రివిక్రమ్ అయితే సరిలేరు ఊసే ఎత్తడం లేదు. ఇక దీని బట్టి చూసుకుంటే ఈ ఇద్దరు స్నేహితుల మధ్య చాలా గ్యాప్ వచ్చేసిందని ఫిల్మ్ నగర్‌లో టాక్ నడుస్తోంది.

 

ఇదిలా ఉంటే సరిలేరు, అల వైకుంఠపురములో సినిమాల మధ్య ముందు నుంచి వార్ జరుగుతూనే వచ్చింది. మొదట ఈ సినిమాల రిలీజ్ డేట్ విషయంలో వివాదం వచ్చింది. అయితే సినీ పెద్దలు మధ్యలో కల్పించుకుని వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఆ తర్వాత కూడా సినిమా నుంచి విడుదలై పోస్టర్లు, ట్రైలర్లు, సాంగ్స్ విషయంలో పోటీ నడిచింది. ఇక సినిమాలు విడుదలయ్యాక కలెక్షన్ల విషయంలో పోటీ నడుస్తుంది. ఎవరికి వారు ఇంత వచ్చేసింది...అంత వచ్చేసింది అంటూ ప్రచారం చేసుకుంటున్నారు.

 

అయితే సినిమా అసలు కలెక్షన్లు వేరుగా ఉన్నాయని తెలుస్తోంది. ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం సరిలేరు వారం రోజుల్లో మొత్తం 84 కోట్ల షేర్ వరకు వసూలు చేసినట్లు తెలిసింది. ఈ సినిమా 103 కోట్ల షేర్ వసూలు చేస్తే హిట్ కొట్టినట్లే. అటు వైకుంఠపురములో 5 రోజుల్లో 80 కోట్ల షేర్ వరకు రాబట్టింది. మొత్తం మీద సినిమా 88 షేర్ వసూలు చేస్తే విజయం సొంతం చేసుకున్నట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి: