రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. జిల్ మూవీ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో ప్రభాస్ కు తల్లిగా బాలీవుడ్ నటి భాగ్యశ్రీ నటిస్తుండగా ఇతర కీలక పాత్రల్లో షాషా ఛత్రి, ప్రియదర్శి, మురళి శర్మ తదితరులు నటిస్తున్నారు. ఇక ఇటీవల ప్రభాస్ జన్మదినం సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ యూట్యూబ్ లో అతి పెద్ద సంచలనాన్ని క్రియేట్ చేసి సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు క్రియేట్ చేసింది. కొన్నేళ్ల క్రితం యూరోప్ లో జరిగిన ఒక యదార్ధ ప్రేమకథకు రూపంగా పలు కమర్షియల్ హంగులు కలగలిపి దర్శకడు రాధాకృష్ణసినిమా తీస్తున్నట్లు టాక్.

ఇకపోతే ఈ సినిమా తరువాత నాగ అశ్విన్ దర్శకత్వంలో ఒక భారీ సినిమా చేయనున్న ప్రభాస్, దానితో పాటు భారీ హిస్టారికల్ మూవీ ఆదిపురుష్ లో కూడా నటించనున్నారు. ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమాలో రావణాసురుడి పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఎంతో గ్రాండ్ లెవెల్లో తీయనున్న ఈ సినిమాని టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ అత్యధిక వ్యయంతో నిర్మించనున్నారు. ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా సీత పాత్రలో నటించే హీరోయిన్ విషయమై ఇప్పటివరకు యూనిట్ ఎవరినీ కూడా ఎంపిక చేయలేదని తెలుస్తోంది.

అయితే ప్రభాస్ ప్రక్కన హీరోయిన్ గా సీత పాత్ర చేసేందుకు టాలీవుడ్, కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ కి చెందిన ఎందరో ముద్దుగుమ్మలు లైన్లో ఉన్నారని, ఆ అవకాశం వస్తే చాలు ఇప్పిటికిప్పుడు అన్ని వదులుకుని ప్రభాస్ తో నటించడానికి సిద్ధమని వారు చెప్తున్నట్లు తెలుస్తోంది. మరి అందరినీ ఎంతో ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఆదిపురుష్ లోని సీత పాత్ర ఏ హీరోయిన్ ని వరిస్తుందో తెలియాలి అంటే మరికొద్దిరోజుల వరకు వెయిట్ చేయక తప్పదని అంటున్నారు విశ్లేషకులు....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: