ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా కోసం హీరోయిన్ వెతికి వెతికి చివరికి శృతిహాసన్ ను ఎన్నో జాగ్రత్తలతో తీసుకోవడం జరిగింది. ఆఖరి నిమిషంలో ఆమె షూటింగ్ లో పాల్గొంది కూడా. పేరుకి హీరోయిన్ పాత్ర అయినప్పటికీ.. సినిమాలో గెస్ట్ రోల్ మాదిరి ఉంటుందట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అలా కనిపించే వెళ్లిపోయే క్యారెక్టర్ లో శృతి కనిపించనుంది. అసలే స్క్రీన్ స్పేస్ తక్కువ ఉంటుందని అనుకుంటుంటే.. ఇప్పుడు దిల్ రాజు శృతి స్క్రీన్ స్పేస్ ను మరింత తగ్గించేశారట.

నిజానికి శృతిహాసన్ ను, పవన్ కళ్యాణ్ ను సెట్స్ పైకి తీసుకురావడానికి దిల్ రాజుకి చాలా ప్రయత్నాలే చేశాడు.మరోపక్క పవర్ స్టార్  వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేయాలంటూ దిల్ రాజుకి చెప్పడంతో.. చేసేదేం లేక పవన్-శృతి కాంబినేషన్ లో తీయాల్సిన పాటను పక్కన పెట్టేశారట. పాట లేకుండానే షూటింగ్ ని పూర్తి చేసేసారు. దీంతో సినిమాలో శృతిహాసన్ కనిపించే నిడివి ఇంకా తగ్గిపోయింది.

అంతేకాదు.. పాట షూటింగ్ లేకపోవడంతో శృతికి ఇవ్వాల్సిన పారితోషికం ను కూడా తగ్గించి ఇచ్చినట్లు సమాచారం అందుతుంది.దాదాపు రూ.20 లక్షలు దాకా తగ్గించి శృతి హాసన్  పారితోషికం  సెటిల్ చేసినట్లు తెలుస్తోంది.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: