టాలీవుడ్
యువ నటుడు నాచురల్ స్టార్
నాని ప్రస్తుతం రెండు సినిమాల్లో హీరోగా చేస్తున్నారు. వాటిలో ఒకటి
శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టక్
జగదీష్ మూవీ కాగా మరొకటి మైత్రి
మూవీ మేకర్స్ బ్యానర్ పై
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కనున్న అంటే సుందరానికి మూవీ. అయితే వీటిలో అంటే సుందరానికి అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుండగా, టక్
జగదీష్ సినిమా యొక్క షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. రీతూ
వర్మ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ
మూవీ ని షైన్ స్క్రీన్స్ సంస్థ ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తుండగా
యువ సెన్సేషనల్ మ్యూజిక్
డైరెక్టర్ థమన్ దీనికి సంగీతం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
ఇక ఈ
మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల
నాని బర్త్ డే సందర్భంగా
యూట్యూబ్ లో రిలీజ్ అయి ఆయన ఫ్యాన్స్ తో పాటు నార్మల్
ఆడియన్స్ నుండి కూడా సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక టీజర్ ని బట్టి చూస్తుంటే ఈ
మూవీ మంచి యాక్షన్ తో కూడిన కమర్షియల్, ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు కొంతవరకు మనకు అర్ధం అవుతుంది.
కాగా అందుతున్న సమాచారాన్ని బట్టి తన అన్న జీవితంలో జరిగిన ఒక దుర్ఘటన కారణంగా శత్రువులతో వైరం ఏర్పడడం, దానిని తమ్ముడైన
నాని ఏవిధంగా ఎదుర్కొన్నాడు అనేది ఈ
మూవీ యొక్క మెయిన్ స్టోరీ లైన్ అని అంటున్నారు. మొత్తంగా ఫస్ట్ లుక్ టీజర్ తో
యూట్యూబ్ లో దుమ్మురేపిన టక్
జగదీష్ తప్పకుండా రేపు రిలీజ్ తరువాత మంచి టాక్ దక్కించుకుంటే కలెక్షన్స్ పరంగా కూడా చెడుగుడు ఆడడం ఖాయం అని అంటున్నారు. కాగా ఈ
మూవీ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 16 న వరల్డ్ వైడ్ గా ఎంతో భారీ లెవెల్లో రిలీజ్ కానుంది.....!!