అక్కడ `ఎం.ఎస్.ధోనీ`, `భాఘి-2` చిత్రాల్లో నటించింది. ఆ సినిమాలు సక్సెస్ అయినా.. ఆ క్రెడిట్ అంతా హీరోలకే వెళ్లిపోయింది. అయితే ఆ సినిమాల సక్సెస్ దిశాకు అడపాదడపా సినిమా అవకాశాలు బాలీవుడ్లో రావడం మొదలు పెట్టాయి. దీంతో అక్కడే సెటిల్ అయిపోయింది దిశ. తాజాగా సల్మాన్ ఖాన్ సరసన రాధేలో ఛాన్స్ కొట్టేసి మెరిసింది. ఈ సినిమా తన కెరీర్ను ఓ రేంజ్కు తీసుకెళుతుందని చాలా ఆశలే పెట్టుకుంది. మే 13న భారీ అంచనాల నడుమ రాధే రిలీజవుతోంది.
కాగా.. ప్రస్తుతం దిశ పటానీ `ఏక్ విలన్ రిటర్స్`తో పాటు మరో సినిమాలో కూడా నటిస్తోంది. ఇంకో రెండు ప్రాజెక్ట్ లు చర్చల దశలో ఉన్నట్లు బాలీవుడ్ టాక్. ఈ నేపథ్యంలో టాలీవుడ్లో అవకాశాలు వస్తే మళ్లీ నటిస్తారా? అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. ``నటిస్తాను.. కానీ కండీషన్స్ అప్లై!`` అంటూ మెలిక వేసిందట. కుర్ర హీరోలు, చిన్న హీరోలతో తాను నటించనని చెప్పేసిందని టాక్.
కెరీర్ ఆరంభంలో మెగా హీరో సరసన నటించిన దిశ.. ఇప్పుడు మాత్రం అలాంటి ఛాన్సులోస్తే నో చెప్పేస్తోందట. కేవలం స్టార్ హీరోల సరసన మాత్రమే నటిస్తానని కుండ బద్దలు కొడుతున్నట్లు టాక్. ఇటీవల పలు తెలుగు కాస్టింగ్ ఏజెన్సీలు కథలతో సంప్రదించగా.. ఇదే సమాధానం చెప్పిందని తెలిసింది.
ఇప్పటివరకు దిశక కెరీర్లో చెప్పుకొదగిన హిట్ ఒక్కటి కూడా లేకపోయినా.. ఈ అమ్మడు ఇంత టెక్కు చూపిస్తుండడంతో టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆమె గురించి పట్టించుకోకూడదని కూడా నిర్ణయించుకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ముందు చూపుతో ఓ మెట్టు దిగి వస్తేనే దిశకు టాలీవుడ్ అవకాశాలు వస్తాయని, ప్రస్తుతం టాలీవుడ్ రేంజ్ ఏంటో ఆమెకు అర్థం కావడం లేదని, ఇలాంటి రూల్స్, కండిషన్స్ పెట్టుకుంటూ పోతో భవిష్యత్తులో ఆమెకే నష్టమని కొందరు క్రిటిక్స్ కూడా హెచ్చరిస్తున్నారు. మరి దిశ ఏం చేస్తుందో చూడాలి.