బాహుబలి
సినిమా తో ఒక్కసారిగా పాన్
ఇండియా స్టార్ గా ఎదిగాడు
రెబల్ స్టార్ ప్రభాస్. ఈ
సినిమా తర్వాత ఆయన చేస్తున్న అన్ని సినిమాలు అదే రేంజ్ లో వుండడం విశేషం. ప్రస్తుతం విడుదలకు సిద్దంగా ఉన్న రాధేశ్యామ్
సినిమా ఆ తర్వాత
ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో సలార్, ఆపై వచ్చే ఆదిపురుష్ మరియు ప్రాజెక్ట్ కే సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కే సినిమాలే కాకా పాన్ వరల్డ్ సినిమాలు.
ప్రభాస్ పాన్ వరల్డ్ ను టార్గెట్ చేస్తూ సినిమాలు చేస్తుండడంతో తప్పకుండా అక్కడ కూడా
సక్సెస్ అవుతాడు అని అంటున్నారు.
ఆ తరహాలో
సినిమా లు చేస్తూ ఇప్పుడు
ప్రభాస్ కి పోటీ ఇస్తున్నాడు మరొక హీరో. ఆయనే
కోలీవుడ్ లో సంచలన విజయాలు నమోదు చేసుకుంటున్న
హీరో ధనుష్. ఇటీవలే
టాలీవుడ్ దర్శకుడు
శేఖర్ కమ్ముల ప్రకటించిన పాన్
ఇండియా సినిమా నే కాకుండా ఆయన మరికొన్ని సినిమాలకు కూడా సంతకాలు చేయడం ఇప్పుడు
కోలీవుడ్ లో
టాలీవుడ్ లో అంతటా చర్చనీయాంశంగా మారింది.
తమిళ తెలుగు
హిందీ భాషలలో అత్యంత భారీ బడ్జెట్ తో
శేఖర్ కమ్ముల ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా త్వరలోనే ఈ
సినిమా మొదలవుతుందని ఇటీవల చెప్పారు.
అందరూ ఈ
సినిమా ఎలా ఉంటుందో అన్న ట్రాన్స్ లోనే ఉండగా
ధనుష్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో మరొక పాన్
ఇండియా సినిమాను త్వరలోనే ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం
కార్తీక్ నరేన్ దర్శకత్వంలో డి43 షూటింగ్ లో ఉన్నారు ధనుష్. ఇటీవల ఆయన పుట్టినరోజు జరుపుకోగా a సందర్భం గా
ధనుష్ చేయబోయే కొన్ని సినిమాల వివరాలు బయటకు వచ్చాయి. తన సొంత
అన్నయ్య సెల్వరాఘవన్ తో ఓ
సినిమా చేస్తున్నాడు. అదే కాకుండా వేరే పెద్ద దర్శకులతో సైతం మరో రెండు సినిమాలను ఒప్పుకున్నాడు. ఇలా బ్యాక్ టూ బ్యాక్ ఐదు సినిమాలను ఓకే చేసి
ధనుష్ ప్రభాస్ లాంటి హీరోతో పోటీ పడుతున్నాడు. మరి
కోలీవుడ్ లో నార్మల్
హీరో గా ఉన్న
ధనుష్ పాన్ వరల్డ్
హీరో గా ఎలా ఎదుగుతాడు చూడాలి.