తెలుగు సినీ పరిశ్రమలో మంచు గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో అజయ్ భూపతి ఒకరు. ఈయన ఆర్ ఎక్స్ 100 మూవీ తో దర్శకుడిగా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ లో కార్తికేయ హీరోగా నటించగా ... పాయల్ రాజ్ పుత్మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకొని మంచి కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇకపోతే ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి అజయ్ భూపతి కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి.

అలా దర్శకత్వం వహించిన మొదటి మూవీ తోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ దర్శకుడు ఆ తర్వాత మహా సముద్రం అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించ లేక పోయింది. ఇకపోతే మహా సముద్రం లాంటి ఫెయిల్యూర్ మూవీ తర్వాత ఈ దర్శకుడు మంగళవారం అనే సినిమా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాని నవంబర్ 17 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు. 

మూవీ ని "యూ ఎస్ ఏ" లో "ఫ్లై హై సినిమాస్" సంస్థ వారు విడుదల చేయనున్నట్లు ... అలాగే ఈ సంస్థ వారు ఈ సినిమా యొక్క ప్రీమియర్స్ ను నవంబర్ 16 వ తేదీనే "యూ ఎస్ ఏ" లో ప్రదర్శించనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇకపోతే ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: