సాదరణంగా సినిమా ఇండస్ట్రీ అనే రంగులు ప్రపంచం ఇంకా తెరమీద కనిపించిన అంత అందంగా ఉండదు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఇక సినిమాల్లోకి వెళ్లి అవకాశాలను దక్కించుకోవాలనుకునే ఎంతో మంది నటీనటులు.. ఇక తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా చేస్తూ ఉంటారు. అయితే ఆ తర్వాత కాలంలో వారు ఒక మంచి పొజిషన్కు వచ్చిన తర్వాత.. వాళ్ళు కెరియర్ మొదట్లో ఎదుర్కొన్న చేదు  అనుభవాల గురించి సోషల్ మీడియాలో పంచుకోవడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.



 అయితే ఒకప్పుడు సినీ సెలబ్రిటీలు కెరియర్లో జరిగిన చేదు అనుభవాల గురించి అభిమానులతో పంచుకునేందుకు.. పెద్దగా ఆసక్తి కనబరిచేవారు కాదు. కానీ ఇటీవల కాలంలో అన్ని విషయాలను కూడా అటు అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు అని చెప్పాలీ. ఈ క్రమంలోనే ఆయా నటీనటులు చెప్పే షాపింగ్ విషయాలు అప్పుడప్పుడు అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి. అయితే ఇక ఇప్పుడు షరతులు వర్తిస్తాయి అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతుంది హీరోయిన్ భూమి శెట్టి కూడా తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.


 షరతులు వర్తిస్తాయి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రస్తుతం బిజీ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమం లోనే వరుసగా ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పాల్గొంటుంది. అయితే తన శరీర రంగు విషయం లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను అంటూ భూమిశెట్టి చెప్పుకొచ్చింది. రంగుపై ఇతరుల మాటలతో ఎంతగానో ఇబ్బంది పడ్డాను. ఇలా ఉంటే ఎవరు పెళ్లి చేసుకుంటారు. ఏవైనా క్రీమ్స్ వాడు అంటూ అందరూ చెప్పేవారు. ఇప్పటికీ ఇంస్టాగ్రామ్ లో నల్లగా ఉన్నావ్ అంటూ కామెంట్లు పెడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు వాటిని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే నా అందం ఏంటో నాకు తెలుసు అంటూ భూమిశెట్టి వ్యాఖ్యలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: