సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఏ రేంజ్ క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్ నటించిన ఏ సినిమా విడుదల అయిన అంటే థియేటర్ ల దగ్గర సందడి వాతావరణం నెలకొంటూ ఉంటుంది. ఈయన సినిమా హిట్ టాక్ ను తెచ్చుకున్నట్లు అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ ల వర్షాన్ని కురిపిస్తూ ఉంటుంది. ఒక వేళ సినిమా కాస్త నెగిటివ్ టాక్ ను తెచ్చుకున్న డీసెంట్ కలెక్షన్ లను వసూలు చేస్తూ ఉంటుంది. ఇకపోతే థియేటర్ ప్రేక్షకులను ఇంతలా మెప్పిస్తున్న మహేష్ బుల్లి తెర ప్రేక్షకులను కూడా సూపర్ గా ఆకట్టుకుంటున్నాడు.

దానితో ఈయన నటించిన కొన్ని సినిమాలకు ఎన్ని సంవత్సరాలు అయినా కూడా మంచి "టి ఆర్ పి" రేటింగ్ బుల్లి తెరపై లభిస్తుంది. ఇకపోతే కొంత కాలం క్రితం మహేష్ , అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమా ఇప్పటి వరకు 15 సార్లు బుల్లి తెరపై ప్రసారం అయ్యింది.

ఈ 15 సార్లు కూడా ఈ సినిమా అద్భుతమైన "టి ఆర్ పి" రేటింగ్ ను బుల్లి తెరపై తెచ్చుకుంది. ఈ మూవీ కి మొదటి సారి ప్రసారం అయినప్పుడు 23.4 "టి ఆర్ పి" రేటింగ్ దక్కగా ... 2 వ సారి 17.4 "టి ఆర్ పి" రేటింగ్ దక్కింది. 3 వ సారి 12.55 , నాలుగవ సారి 10.18 , ఐదవ సారి 6.41 , ఆరవ సారి 5.11 , ఏడవ సారి 6.83 , ఎనిమిదవ సారి 6.59 తొమ్మిదవ సారి 2.60 , పదవ సారి 3.79 , 11 వ సారి 4.10  , 12 వ సారి 4.21 ,  13 వ సారి 5.09 ,  14 వ సారి 6.14 , 15 వ సారి 4.10 "టి ఆర్ పి" రేటింగ్ దక్కింది. ఇలా ఈ సినిమా అదిరిపోయే రేంజ్ "టి ఆర్ పి" రేటింగ్ ను బుల్లి తెర పై తెచ్చుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: