టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడైనా పాన్ ఇండియా స్టార్ యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ కి ఉన్న పాన్ ఇండియా క్రేజ్ అంతా ఇంత కాదు. ఈ నేపథ్యంలో ఆయనతో ఒక్క సినిమా చేస్తే చాలు అన్నట్లుగా సౌత్ నుంచి నార్త్‌ కి చెందిన స్టార్‌ దర్శకులు ఎంతో మంది ట్రై చేస్తున్నారు.ఎందుకంటే ప్రభాస్ ఇండియాలో ట్రెండింగ్ లో కొనసాగుతున్నారు.దేశంలో ఎంతో మంది డైరెక్టర్లు రెబల్ స్టార్ ప్రభాస్‌ తో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న ఈ సమయంలో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ మాత్రం.. ప్రభాస్‌ తో సినిమాకు తన వద్ద సమయం లేదు అంటూ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారితో చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో అనేక రకాల గాసిప్స్ బలంగా వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రభాస్‌ హీరోగా లోకేష్‌ కనగరాజ్ దర్శకత్వంలో సినిమాను నిర్మించేందుకు చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే డైరెక్టర్ లోకేష్‌ కనగరాజ్ తో సినిమాకి సంబంధించి చర్చలు కూడా జరిపారు.


కానీ ముందుగానే కమిట్ అయ్యి ఉన్న సినిమాల కారణంగా ప్రభాస్ తో సినిమా చెయ్యడం ఇప్పట్లో సాధ్యం కాదని ఆయన అన్నాడట. ప్రభాస్ అంటే తనకు అభిమానం అంటూనే ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్‌ మూవీ తో పాటు ఖైదీ 2, విక్రమ్‌ 2 ఇంకా విజయ్ లియో సీక్వెల్స్ ను చేయాల్సి ఉండగా ఆయనతో సినిమాను చేయలేకపోతున్నట్లు లోకేష్ కనగరాజ్ తన సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చాడని సమాచారం తెలుస్తుంది. ఇంకా అలాగే మరో వైపు పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్‌ కూడా వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు. ఒక వేళ లోకేష్ కనగరాజ్ సిద్ధంగా ఉన్నా కూడా ప్రభాస్ మాత్రం కల్కి, రాజా సాబ్‌, సలార్‌ 2, హను రాఘవపూడి మూవీ ఇలా చాలా పెద్ద పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెట్టాడు కాబట్టి కాస్త సమయం అడిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి వీరిద్దరూ కూడా ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. కాబట్టి రాబోయే రెండు మూడు సంవత్సరాల తర్వాత అయినా వీరి కాంబో మూవీ ఉంటుందేమో అని అభిమానులు ఆశిస్తున్నారు.మరి చూడాలి ప్రభాస్ అభిమానుల అసలు ఫ్యూచర్ లో ఫలిస్తాయో లేదో..

మరింత సమాచారం తెలుసుకోండి: